మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
మంచిర్యాలటౌన్, జూలై 26 : వరద బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. పట్టణంలోని ప్రభావిత ప్రాంతాలు ఎన్టీఆర్ నగర్, కుమ్రం భీం కాలనీ, ఎల్ఐసీ కాలనీ, రాంనగర్ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇండ్లలోకి వరద చేరి సామగ్రి, ఇతర వస్తువులు పాడైపోయాయయని పలువురు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చా రు. దీంతో ఆయన స్పందిస్తూ ప్రభుత్వం తరఫున అందాల్సిన సహాయ కార్యక్రమాలను సకాలంలో అందేలా చూస్తానని హా మీనిచ్చారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు బ్లీచింగ్ చల్లి, డ్రైనేజీలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, కౌన్సిలర్లు ప్రకాశ్నాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, తదితరులు పాల్గొన్నారు.
రైతులు అధైర్య పడొద్దు : ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
పెంచికల్పేట్ , జూలై 26 : వరదలతో పంట నష్టపోయిన రైతు లు అధైర్యపడవద్దని, అండగా ఉంటానని ఎమ్మెల్యే కోనేరు కోన ప్ప అన్నారు. మండలంలోని ఎల్లూర్, ఎల్కపల్లి, అగర్గూడ, గన్నారం, పెంచికల్పేట్లో ముంపునకు గురైన పంటలను ఏడీఏ రాజుల నాయుడుతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఏఈవోలు శ్రీవిద్య, ప్రేమలత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చౌదరి తిరుపతి, సర్పంచ్లు జాజిమొగ్గ శ్రీనివాస్, దుర్గం రాజన్న, ఎస్ఐ సీహెచ్ రమేశ్, టీఆర్ఎస్ నాయకులు సముద్రా ల రాజన్న, సదాశివ్, ఖైరాత్, ఎల్మూల వెంకటి, రైతులు మార న్న, సత్యనారాయణ, పోచం, తదితరులు పాల్గొన్నారు.