పటాన్చెరు, మే 19: పరిశుభ్రమైన నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ 113లో నిర్మాణంలో ఉన్న నాన్వెజ్ మార్కెట్ను ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణంలోని నాణ్యత, డ్రైనేజీ, ఇతర సదుపాయాలను అధికారులు, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతం ఎమ్మెల్యే మాట్లాడారు. పెరుగుతున్న జనాభా కారణంగా నాన్వెజ్ దుకాణాల వద్ద రద్దీ పెరుగుతుందన్నారు. శుభ్రమైన మాంసాహార ఉత్పత్తులను వారికి అందుబాటులోకి తీసుకుని వస్తే వ్యాధులు రావన్నారు. కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో పటాన్చెరు పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. పరిశుభ్రమైన, వసతులతో కూడిన నాన్వెజ్ మార్కెట్ అందుబాటులోకి త్వరలోనే వస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట బల్దియా అధికారులు వెంకటరమణ, టీఆర్ఎస్ నాయకులు విజయ్కుమార్ తదితరులు ఉన్నారు.