కోటపల్లి : గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కేటాయించడంతో టెండర్లలో అందరికి సమన్యాయం అందనుందని కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ అన్నారు. వైన్స్లలో రిజర్వేషన్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా శనివారం కోటపల్లి మండలకేంద్రంలోని తెలంగాణ చౌక్లో గౌడ, ఎస్సీ, ఎస్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. వైన్స్లో రిజర్వేషన్లు కేటాయించడం వల్ల ఆర్థికంగా ఉన్న వారికే కాకుండా గౌడ,ఎస్సీ, ఎస్టీలకు సమన్యాయం అందనుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రగిరి శంకరయ్య, గౌడ కులస్తులు రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శంకర్, ఎస్సీ కులస్తులు బి మల్లయ్య, మంత్రి రామయ్య, ఎస్టీ కులస్తులు కొమిరెళ్ళి విజయ్, గుగ్లోత్ సమ్మయ్య నాయక్, సప్ప మధుకర్ తదితరులు పాల్గొన్నారు.