శారీరక దృఢత్వం అవయవాల సమతుల్యత
రోగనిరోధక శక్తి పెంపునకు దోహదం
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సం
మహబూబ్నగర్ టౌన్, జూన్ 20 : ఉరుకులు, పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక లేకుండాపోతున్నది. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారో గ్యం బారినపడుతున్నారు. ఈ క్రమంలో యావత్ ప్ర పంచం యోగా వైపు చూస్తున్నది. సర్వరోగాలకు యో గానే మందు అని ప్రజలు గుర్తించి అటు వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో యోగా చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. పిల్లలు, పెద్దలు, యువత, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వయస్సుల వారు యోగా చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ మానసిక, శారీరక రుగ్మతలు కలుగుతున్నాయి. దీంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కోసం యోగాను ఆశ్రయిస్తున్నారు. ఇంతకుముందు యోగా చేసే వారిలో ఎక్కువ శాతం వయస్సు పైబడిన వారే ఉండేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. యువత కూడా యోగా చేయడానికి ముందుకొస్తున్నది. నేడు ‘యోగా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం..
యోగాతో రోగాల కట్టడి..
కరోనా నుంచి బయటపడాలంటే భౌతికదూరం, శా నిటైజర్, శారీరక దృఢత్వం పెంపొందించుకోవడం ఒక్క టే మార్గమని డాక్టర్లు, నిపుణులు సూచిస్తున్నారు. కరో నా వైరస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూసి మరణానికి దారి తీస్తుంది. వైరస్ సోకినప్పుడు జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒంటి నొప్పులు, కొన్ని సందర్భాల్లో ఆయాసం తీవ్రస్థాయికి చేరుకొని శ్వాస తీసుకునేందుకు కష్టంగా మారుతుంది. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు నిత్యం గంట యోగా చేసి ప్రాణాయామం తో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఆసనాల అభ్యసనం ద్వారా రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.
ఆసనాలు..
ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్యనమస్కారం చేయాలి. సూర్యుడి లేలేత కిరణాలతో డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. యోగాసనాల ద్వారా నడుమునొప్పి, థైరాయిడ్, డయోబెటిస్, ఒబెసి టీ దూరమవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యాలను పెం చుతుంది. కపాలబాతి ద్వారా కపాలంలో ఉన్న కఫాన్ని, త్రాటక ద్వారా కంటిని శుద్ధి చేసుకోవచ్చు. నేతి ద్వారా ముక్కురంధ్రాలు, గొంతు భాగం, ధౌతి ద్వారా నోటి నుంచి జీర్ణాశయం వరకు శుభ్రపరచగలం.
ఆకట్టుకుంటున్న చిన్నారి..
జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో నివాసం ఉంటూ ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి హన్షు యోగాసనాలతో ఆకట్టుకుంటున్నది. తన తల్లి అరుణజ్యోతి చిన్నారికి యోగా నేర్పించింది. ప్రభుత్వ బాలిక పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న అరుణజ్యోతి యో గాలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు.
28 ఏండ్లుగా యోగా శిక్షణ..
మహబూబ్నగర్ పట్టణంలో 25 ఏండ్లుగా యోగా నేర్పిస్తున్నా. ప్రేమ్హెల్త్ క్లబ్ స్థాపించి స్థానిక జిల్లా పరిషత్ మైదానంలో ప్రతి రోజూ యోగా చేయిస్తున్నా. ఎంతో మంది యోగా నేర్చుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారు. యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడొచ్చు.
– డాక్టర్ ప్రేమ్కుమార్, ప్రేమ్ హెల్త్ క్లబ్ఫౌండర్