గద్వాల, జనవరి 18 : యాసంగి సీజన్లో ప్రాజెక్టులను నమ్ముకొని పంటలు సాగు చేయాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం.. ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి సమృద్ధిగా వరద జలాలు రాకపోవడంతో మన ప్రాజెక్టుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. రోజురోజుకూ ప్రభావం పెరుగుతుండడంతో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మా రింది. ఇప్పటికే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటి పోతుండడంతో సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తున్నది.
కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు కింద ఇప్పటికే అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో ఆ ప్రభావం మన జూరాల డ్యాంపై పడింది. దీంతో ఉమ్మ డి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ఈ ప్రా జెక్టులో ఆశించిన స్థాయిలో నీటిమట్టం లేక జలకళ త ప్పింది. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు బీడుగా మారిం ది. కేవలం బోరుబావుల కింద మాత్రమే పంటలు సా గు చేస్తున్నారు. మరెక్కడా పంటలను రైతులు సాగు చే యడం లేదు. ఈ ఏడాది ధాన్యానికి ధర భారీగా పెరగడంతో యాసంగిలో వరి పంట వేయాలని రైతులు బోర్ల కింద నారుమడులు పోసుకున్నారు. ఈ ఏడాది కాలం కలిసొచ్చి.. పంటలు బాగా పండితే అప్పులు తీరుతాయన్న రైతుల ఆశలకు ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించడంతో అడియాశలుగా మారాయి. జూరాల పరిధిలో ఎక్కడ చూసినా ప్రస్తుతం బీడు భూములు దర్శన మి స్తున్నాయి. గత యాసంగిలో జూరాల కుడి కాల్వ ద్వారా 14,534 ఎకరాలకు సాగునీరు అందింది. ఈ ఏడాది అందులో 10 శాతం భూములు కూడా సాగులోకి రాలేదు. రాజోళిబండ మళ్లింపు పథకం కింద 33, 683 ఎకరాలకు సాగు నీరు అందించగా.. ఈ ఏడాది నీరు రాకపోవడంతో క్రాప్ హాలిడే ప్రకటించారు. అ లాగే జవహార్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం ద్వారా 40,044 ఎకరాలకు నీరు అందించగా.. ఈ ఏడాది కేవలం అక్కడి రిజర్వాయర్లో నీటి లభ్యత మేరకు మాత్రమే 5 వేల ఎకరాలకు మాత్రమే అధికారులు ప్రతిపాదించారు. అయితే 2023-24 యాసంగిలో అన్ని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు అయోమయంలో పడ్డారు. పంటలు వేయకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ ఏడాది ధాన్యానికి మద్దతు ధర బాగుంది. యాసంగి పంటలు సాగు చేస్తే మంచి మద్దతు ధర లభిస్తుందని భావించిన కర్షకులకు నిరాశే మిగిలింది. గత వర్షాకాలంలో ప్రాజెక్టుకు వరద వచ్చినా నీటిని నిల్వ చేసుకోకపోవడం.. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేయడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పొచ్చు.
జూరాలలో రోజురోజుకూ నీరు అడుగంటిపోతుంది. ఈ ప్రభావం తాగునీటిపై పడే అవకాశం లేకపోలేదు. రైతులు ఇటు సాగునీటికి నోచుకోక.. అటు ప్ర జలు తాగునీటికి నోచుకోక ఇ బ్బందులు పడే పరిస్థితి దా పురించింది. ఈ ఏడాదిలో ఇక్కడి ప్రజలకు తాగునీ టి కష్టాలు తప్పేలా లే దు. ప్రజల తాగునీటి అవసరాల కోసం జూరాలలో కనీసం 3 టీఎంసీలు ఉం డాలి. కానీ ప్రస్తు తం కేవలం రెండున్నర టీఎంసీలకు మించి నిల్వలు లేవు. ఈ ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథకు తాగునీటి సరఫరాతో పా టు కుడి, ఎడమ కాల్వలకు, భీమా ఎత్తిపోతల కు, నెట్టెంపాడ్, కోయిల్సాగర్కు నీటిని వినియోగిస్తారు. జూరాల అడుగండడంతో ఈ ప్రభావం అన్ని ప్రాజెక్టులపై పడింది. దీంతో బీడు భూములే దర్శనమిస్తున్నాయి.
గత యాసంగిలో నాకున్న మూడెకరాల్లో వరి సాగు చేశా ను.. దిగుబడి బాగానే రావడంతో రూ.లక్ష వరకు మిగిలింది. ఈ సారి జూరాల కిం ద క్రాప్ హాలిడే ప్రకటించడం తో బోరు బావుల కింద కే వలం ఎకరాలో వరి వేశాను. ధాన్యానికి మార్కెట్లో మం చి ధర లభిస్తుంది. ఈ తరుణంలో జూరాల నుంచి యా సంగికి సాగునీరు అందించి ఉంటే మళ్లా మూడెకరాలు వే సోటోన్ని. ధర బాగొస్తుండడంతో అప్పుల ఊబి నుంచి గట్టెక్కేవాడిని. మంచి తరుణంలో సాగునీటి కష్టాలు ఎదురయ్యాయి.
ఈ ఏడాది ధాన్యానికి మంచి ధర వస్తున్న ది. యాసంగిలో వరి సాగు చేద్దామంటే నీ రు లేదు. రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గతంలో జూరాల కింద నేను 8 ఎకరాల్లో వరి పండించేటోడిని. ప్రస్తుతం జూరాల నుంచి యాసంగికి నీటి విడుదల లేకపోవడంతో బోరు బావి కింద కేవ లం మూడెకరా లు మాత్రమే వేశాను. యాసంగి సీజన్ వస్తే పచ్చని పొలాలతో పచ్చగా కనిపించే మా ఊరు.. ప్రస్తుతం బీడు భూములతో కనిపిస్తుండడం బాధగా ఉన్నది.