అచ్చంపేట, అక్టోబర్ 10 : ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు వాహనాల తనిఖీలు ప్రారంభించారు. మంగళవారం పట్టణంలోని నడింపల్లి ఎక్స్రోడ్ వద్ద ప్రధాన రహదారిపై వాహనాలను తనిఖీ చేశారు. అచ్చంపేట సీఐ అనుదీప్, అచ్చంపేట, సిద్దాపూర్ ఎస్సై గోవర్ధన్, శేఖర్, సిబ్బంది అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపులు, ఆటోలు ఇతర వాహనాలను తనిఖీలు చేశారు. ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు ప్రతివ్యక్తి రూ.50వేలకు మించి నగదు ఉంటే సీజ్ చేస్తామని సీఐ తెలిపారు. నగదుకు సంబంధించి వివరాలు తెలియజేస్తే సీజ్ చేయమని అంతకన్నా.. ఎక్కువ డబ్బులు ఉంటే సీజ్ చేస్తామని సూచించారు. అనుమానం ఉన్న రహదారులపై వాహనాల తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వాహనాలపై నిఘా పెంచామని అచ్చంపేట అన్నిప్రాంతాల్లో నిఘా ఉంటుందన్నారు. మంగళవారం రూ.లక్షా63వేలు నగదు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున అనుమానంతో రూ.లక్షా 63వేలు నగదు సీజ్ చేశామని ఎస్సై గోవర్ధన్ తెలిపారు. దానికి సంబంధించి ఆధారాలు చూపిస్తే విచారణ జరిపి డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
పట్టుబడిన రూ.2.35లక్షలు
కొత్తకోట, అక్టోబర్ 10: కొత్తకోట పట్టణ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద సోమవారం రాత్రి కారులో తరలిస్తున్న రూ.2.35లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మంజునాథ్రెడ్డి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మదనాపురం మండలం గోవిందహళ్లికి చెందిన దాసరి చంద్రశేఖర్ తన కారులో రూ.2.35లక్షలను తరలిస్తుండగా పట్టుకున్నారు. అట్టి డబ్బులను ఎన్నికల అధికారులకు డిపాజిట్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక వ్యక్తితో రూ.50వేలు మించి ఉండరాదని, ఎన్నికలు ముగిసేవరకు కోడ్ అమలులో ఉంటుందని, ఎవరైనా నగదు, అభరణాలను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
కృష్ణ, అక్టోబర్ 10: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అక్రమంగా పొరుగు రాష్ర్టాలైన గోవా, కర్ణాటక నుంచి మద్యం, నగదు తెలంగాణలోకి రవాణా కాకుండా మండలంలోని కృష్ణ బార్డర్ చెక్ పోస్టు వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మంగళవారం తెల్లవారుజామున మద్యం సీసాలు తరలిస్తుండగా.. ఎక్సైజ్ ఎస్సై ఆధ్వరంలో జిల్లా టాస్క్ఫోర్స్ టీమ్ మహబూబ్నగర్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకుని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ వెంకట్రెడ్డి, తెలిపారు. తనిఖీలో ఎక్సైజ్ సిబ్బంది మల్లనగౌడ్, సయ్యద్ బాషా, జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది హహ్మద్పాషా, అబ్దుల్ రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.