మహబూబ్నగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ లో బీసీలపై బీజేపీ కుట్రలకు తెరలేపుతున్నదని, రాష్ట్రంలో బీసీ వాదమే లేదని చె ప్పడానికి ఇదంతా చేస్తుందని ఎక్సైజ్, క్రీ డా శాఖల మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం మంత్రి మీడియాతో మాట్లాడా రు. రాష్ట్రంలో బీజేపీకి మూడు, నాలుగు సీట్లు కూడా రావని ఏ సర్వే చూసినా తె లుస్తుందని, అలాంటి చోట ముఖ్యమంత్రిగా బీసీ అభ్యర్థిని చేస్తామని ప్రకటించ డం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రచారం చేస్తునే.. కావాలనే ఓడిపోయే స్థానాలు కేటాయిస్తుందన్నా రు. ‘ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇచ్చాం.. కానీ ఓడిపోయారు.. చూశారా..? అస లు బీసీ వాదమే లేదు’ అంటూ సన్నా యి నొక్కులు నొక్కాలని చూస్తున్నదన్నా రు. ప్రధాని మోదీ బీసీ అని చెబుతున్న బీజేపీ.. 80 శాతం జనాభా ఉన్న బీసీల కు ప్రత్యేకంగా ఎందుకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలపై ప్రేమ ఉంటే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డి మాండ్ చేశారు. బీసీలకు మీ పార్టీ ఏం చేసిందో చెప్పాలన్నారు.
నిన్న మొన్నటి వరకు మీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే కదా? అతడిని ఎందుకు మార్చారు అని నిలదీశారు. బీసీలకు అణగదొక్కుతూనే మళ్లీ వారి గురించే మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. రాష్ట్రంలో రూ.వందల కో ట్ల విలువైన భూమిని సీఎం కేసీఆర్ సర్కారు బీసీలకోసం కేటాయించిందని వారి కోసం ఎన్నో గురుకులాలు ఏర్పా టు చేసిందని.. ఓవర్సీస్ పథకం కింద ఎంతో మంది పేద బీసీల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం చేస్తున్నదని.. ఇవ న్నీ మీకు కనిపిస్తలేవా? అని అన్నారు. మోదీ ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేకం గా కేంద్రీయ విద్యాలయాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? బీసీలను ఎ మ్మెల్సీలుగా ప్రతిపాదిస్తే ఎందుకు తిరస్కరిస్తున్నారు? అని నిలదీశారు. విశ్వబ్రాహ్మణుడైన శ్రవణ్కు నామినేట్ చేస్తే.. మీ పార్టీ అధ్యక్షుడు గవర్నర్కు చెప్పి ఎం దుకు ఆపారో సమాధానం చెప్పాలన్నా రు. బీసీల గురించి ఆలోచించింది.. ఆ త్మగౌరవ భవనాలు ఇచ్చింది.. ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది.. బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. దమ్ముంటే బీసీలకు సీట్లు దానం ఇవ్వ డం కాదు.. అది ఒక హక్కుగా మాకు ద క్కాలన్నారు. బీసీ అయిన తనకు ముఖ్యమంత్రి ఆరు శాఖలు అప్పగించారన్నా రు. జనాభాను కులగణన ప్రాతిపాదికన ఎందుకు లెక్కించడంలేదన్నారు. దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందో చెప్పాలన్నారు. తలకిందులు తపస్సు చేసిన బీసీలు కాంగ్రెస్, బీజేపీలను నమ్మేపరిస్థితిలో లేరన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.
పాలమూరు, అక్టోబర్ 21 : ఇక నుంచి ట్యాంక్బండ్ వేదికగా దసరా ఉ త్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీ నివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ని ఆర్యసమాజ్లో శనివారం దసరా ఉ త్సవ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దసరా వేడుకలు మొదట టీడీగుట్టలో.., ఆ తర్వాత జెడ్పీ మైదానంలో నిర్వహించామన్నా రు. మూడేండ్ల కిందట జెడ్పీ మైదానం లో జరిగిన అగ్నిప్రమాదంలో ఫైర్ ఇం జన్ కూడా కాలిపోయిందన్నారు. ఈ ఉ త్సవాలకు శాశ్వత వేదికను ఏర్పాటు చే యాలని నిర్ణయించామన్నారు. ట్యాంక్బండ్ మధ్యలో ఉన్న ఐలాండ్ లో శాశ్వతంగా జమ్మిచెట్లు నాటి దసరా కట్టను నిర్మిస్తామన్నారు. అక్కడే ఉత్సవాలు, పటాకుల కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దసరా రోజున ఆర్యసమాజ్ నుంచి రాలీగా బయలుదేరి క్లాక్టవర్, అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్ ఐలాండ్ వరకు చేరుకుంటుందన్నారు. ట్యాంక్బండ్ వద్ద స్వరలహరి క ల్చరర్ అకాడమీ, దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాలతోపాటు పలు సాంస్కృతిక సం స్థల ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చే స్తున్నామన్నారు. సమావేశంలో దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మురళీధర్రా వు, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, ముడా చైర్మన్ వెంక న్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వై స్ చైర్మన్ గణేశ్, మార్కెట్ కమిటీ వైస్ చై ర్మన్ గిరిధర్రెడ్డి, ధ్వజదారి కండే కు మార్, నాయకులు రాములు, రాజేశ్వర్, లక్ష్మణ్, శివరాజ్, మాల్యాద్రి ఉన్నారు.