జడ్చర్ల, నవంబర్ 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎంతో ప్రగతి సా ధించామని, పని జరగలేదని మీకు అనిపిస్తే ఓటు వేయొద్దని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని స్వర్ణకారులు, బులియన్ మర్చంట్ సం ఘాల ఆధ్వర్యంలో బుధవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎంతో మంది సీఎంలు పనిచేశారని, వారి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు విద్యుత్తో తీవ్ర ఇబ్బందులు పడ్డారని, నేడు నిరంతర విద్యుత్తో సాగువిస్తీర్ణం పెరిగిందన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్లోకి తీసుకురావడంతో పచ్చని పొలాలు కనిపిస్తున్నాయన్నారు. గత తాగునీళ్లు కూడా ఇవ్వలేకపోయారని, ఎన్నికల వేళ మా త్రమే కాంగ్రెస్ నాయకులు దర్శనమిస్తారన్నారు. స్వర్ణకారులు, బులియన్ మ ర్చంట్ వారికి అండగా ఉంటామన్నారు. కమ్యూనిటీహాల్కు స్థలం కేటాయిస్తామన్నారు. కాగా, స్వర్ణకారులు, బులియన్ మర్చంట్ సంఘాల సభ్యులు లక్ష్మారెడ్డి వెంటే ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, మాజీ చైర్మన్ లక్ష్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సంగీత, నాటక అకాడమి మాజీ చైర్మన్ శివకుమార్, కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, రమేశ్, చైతన్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుభాన్, నాయకులు రామ్మోహన్, శ్రీకాంత్ ఉన్నారు.