గద్వాల, మార్చి 30 : సన్న, చిన్న కారు రైతుల కష్టాలను ప్రభుత్వం దూరం చేసింది. గ తంలో సరిపడినన్ని గోదాంలు లేకపోవడంతో ధాన్యాన్ని ఇంటి వద్ద నిల్వ చేసుకోలేక మద్దతు ధర వచ్చినా.. రాకున్నా అమ్ముకునేవారు. వీటన్నింటిని గుర్తించిన సర్కార్ రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లేని సమయంలో.. ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకుగానూ గోదాంల ఏర్పాటుకు పూనుకున్నది. గ తంలో ఉన్నవాటికి అదనంగా జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంతోపాటు ప్రతి మండల కేంద్రంలో ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాంలు నిర్మించింది. ఇవి అందుబాటులోకి రావడంతో అన్నదాతలు సంతోషంగా ధాన్యం నిల్వ చేసుకుంటున్నారు.
గద్వాలలోని 34 గ్రామాలు, మల్దకల్లోని 20, ధ రూర్లోని 54, గట్టులోని 60, అయిజలోని 52 గ్రామాల రైతులు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో నిల్వ చేసుకునే అవకాశం లభించిందని అధికారులు తెలిపారు. రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకున్న తరువాతనే మిగిలిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇవ్వనున్నారు. జిల్లాకేంద్రంలోని పత్తి మా ర్కెట్ సమీపంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాంలను నిర్మించింది. దీనితోపాటు మరో రెండు గోదాంలు నిర్మించి.. సీసీ రోడ్లు వేసి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో రైతుల ధాన్యంతోపాటు సివిల్ సప్లయ్కు సంబంధించిన బియ్యం కూ డా స్టాక్ చేసి అక్కడ నుంచి రేషన్ దుకాణాలకు తరలిస్తున్నారు.
1985-87 మధ్యకాలంలో గద్వాల, అ లంపూర్, అయిజ వ్యవసాయ మార్కెట్లో రై తుల అవసరాల మేరకు నాలుగు గోదాంలను 9,600 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించారు. సాగునీరు పుష్కలంగా ఉండడంతో ఆ ర్డీఎస్, జూరాల, నెట్టెంపాడు కింద వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది. దీంతో ఆ నాడు నిర్మించిన గోదాంలు ఏ మూలకూ సరిపోవడంలేదు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం జిల్లాలో మార్కెట్ గోదాంలు మినహాయిస్తే.. అదనంగా 55 వేల మెట్రిక్ సామర్థ్యంతో 11 గిడ్డంగుల ను నిర్మించింది. మార్కెట్ గోదాంలు కలుపుకొంటే ప్రస్తుతం రైతులకు 64,600 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాంలు ఉన్నాయి. దీంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మండలకేంద్రంలో..
జిల్లాలో నీరు పుష్కలంగా ఉండడంతో రై తులు వరి, వేరుశనగ, కందులు, మిర్చి, ఆ ముదం, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంట లు సాగు చేస్తున్నారు. పంట ఉత్పత్తులను ఇంటి వద్ద భద్రపర్చుకునే అవకాశం లేకపోవడంతో రైతులు గోదాముల్లో స్టోర్ చేసుకుంటున్నారు. ఇందుకుగానూ గద్వాల వ్యవసాయ మార్కెట్లో రెండు, మల్దకల్ మండలం కుర్తిరావులచెర్వు, గట్టు మండలం రాయపురం, ధరూర్ మండలం గంగన్పల్లి సమీపంలో ఒ క్కో గోదాంను ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించారు. అలాగే అయిజ మండల కేంద్రంలో, వడ్డేపల్లి, మానవపాడు, అలంపూర్, ఇటిక్యాలలో కూడా గోదాంలు ఏర్పాటు చేశారు.