వనపర్తి : వపపర్తి(Wanaparthi) జిల్లా అమరచింత మండలం ధర్మపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు(BRS workers) గోపి, సోమన్న అనే అన్నదమ్ములకు చెందిన రెండు ఆటోలు, స్కూటీలను నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దగ్ధం(Vehicles burnt )చేశారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ మండల నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. నిందితులను గుర్తించి కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. రాజకీయ కక్షతోనే ఇలాంటి దురాగాతాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ దాడులకు పాల్పడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.