వనపర్తి : కాలువలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని
వీపనగండ్ల మండలం గోపల్ దిన్నే- పుల్గర్చర్ల గ్రామాల మధ్య చోటు చేసుకుంది. రెండు గ్రామాల మధ్యలో గల కాలువలో గురువారం ఓ శవం లభ్యమైంది. మృతుడు పెబ్బేరుకు చెందిన గడ్డమీది కుర్మన్నగా గుర్తించినట్లు పోలిసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.