వనపర్తి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా వనపర్తి మండలం రాజాపేట పెద్దతండాకు చెందిన రాజాపేట సింగిల్ విండో కాంగ్రెస్ డైరెక్టర్ నూన్ సావత్ జయరాం నాయక్ టీఆర్ఎస్లో చేరారు.
ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సరైన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ రఘువర్దన్ రెడ్డి, మాజీ వాటర్ షెడ్ డైరెక్టర్ బాలగౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ నాయక్, కురుమూర్తి నాయక్ ఉన్నారు