వనపర్తి : సీఎం కేసీఆర్ ఈనెల 8న వనపర్తిలో పర్యటించనున్నారు. వనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు – మన బడి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. దీంతో బహిరంగ సభ కోసం స్థలం, మన ఊరు – మన బడి కార్యక్రమం ప్రారంభ ఏర్పాట్లను మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. మంత్రి వెంట పాఠశాల విద్య రాష్ట్ర డైరెక్టర్ శ్రీదేవసేన, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఉన్నారు.