ధారూరు, ఏఫ్రిల్ 11: కడుపు నోప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చొటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ మండలం రాళ్లచిటేంపల్లి గ్రామానికి చెందిన బర్ల పద్మారెడ్డి(57) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించుకునే వారు.
గత రెండు సంవత్పరాలు నుంచి తీవ్రమైన కడుపు నోప్పితో బాధపడేవాడని, వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ అసుపత్రిలో చూపించుకున్న తక్కువ కాలేదన్నారు. దీంతో తాను పురుగుల మందు తాగానని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే వికారాబాద్ పట్టణంలోని ఓ దవాఖానకు తరలించారు. చికిత్స పోందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.