వనపర్తి : జిల్లాలోని పెబ్బేరు మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు కొత్తకాపు నరేందర్ రెడ్డి (38) గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం పెబ్బేరులోని తన ఇంట్లో అస్వస్థతకు గురైన ఆయనను కర్నూలుకు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.
తోమాలపల్లె ఉప సర్పంచ్గా ఎన్నికైన ఆయన టీఆర్ఎస్ లో చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందాడు. గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. నరేందర్ రెడ్డికి భార్య నిహారిక, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.