జడ్చర్లటౌన్, నవంబర్ 23 : ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు, 24 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇచ్చి కరెంటు, నీళ్ల కష్టాలు తీర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరొసారి గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 5, 21వ వార్డుల్లో గురువారం ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించా రు. పాతబజార్లోని 21వ వార్డులో పాతబస్టాండ్ ప్రాంతం నుంచి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి కరెంటు, నీళ్లకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా యా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు, నీళ్లు బా గా వస్తున్నాయని.. ఇప్పుడు ఏలాంటి ఇబ్బంది లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పదేండ్లలో గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలను పూర్తి చేశామని, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించామని.. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి పనులు చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జడ్చర్లలో చేపట్టిన అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీని మరొసారి గెలిపిస్తే సౌభాగ్యలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ప్రతినెలా రూ.3వేలు అందుతాయని, రూ.400లకే గ్యాస్ సిలిండర్ వస్తుందని వివరించారు. అలాగే 5వ వార్డులోని నిమ్మబావిగడ్డ ఫెరోజ్నగర్కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే కుల, మతాల కొట్లాటలు లేకుండా అందరూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కరెంటు, నీళ్ల కష్టాలుంటాయని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కారు గుర్తుకు ఓటు వేస్తామని వృద్ధులు ఎమ్మెల్యేను ఆశీర్వాదించారు.
జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 60 మంది ఆటోడ్రైవర్లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఆటో యూనియన్ సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు గుండు సంధ్య ఆధ్వర్యంలో మహిళలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా చంద్రుతండాకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. తండా రూపురేఖలు మార్చి, తండాలకే అధికారం కట్టబెట్టిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని తండావాసులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పాతబజార్కు చెందిన పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.