అచ్చంపేట, జనవరి 21 : మాది ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర ప్రజల అవసరా లు, ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దా మోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం శ్రీశైలంలోని భ్రమరాంబిక, మల్లికార్జున స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ఈగలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని ఎమ్మెల్యే వం శీకృష్ణతో కలిసి సందర్శించారు. గతంలో జెన్కోలో జరిగిన ప్రమాద స్థలాన్ని ప రిశీలించారు. విద్యుదుత్పత్తి నిర్వహణను జెన్కో చీఫ్ ఇంజినీర్ సూర్యనారాయ ణ, ఎస్ఈలు ఆదినారాయణ, రవీంద్రకుమార్ వివరించారు. అనంతరం ప్రధా న కంట్రోల్రూమ్, చివరి ఫ్లోర్కు వెళ్లి క్షేత్రస్థాయిలో విద్యుత్ ఉత్ప త్తి పనితీరును తెలుసుకున్నారు. అంతకుముందు దోమలపెంట జీపీలో రాములమ్మ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత సేవ అంబులెన్స్ సౌకర్యం, మంచినీటి సరఫరా, వీధిలైట్లు, టాయిలెట్స్ నిర్మాణాలను ప్రారంభించారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్ నిర్వాహకుడు వెంకటేశ్ను అభినందించారు. దోమలపెంటలో రూ.20 లక్షలతో పల్లె దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన వెంట నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీశైలం, జనవరి 21 : శ్రీశైల భ్రమరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్లను మంత్రి దామోదర రాజనర్సింహ దంపతులు దర్శించుకొన్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో తిలకధారణ చేసి పూలమాలతో స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శేషవస్త్రంతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.