నారాయణపేట/భూత్పూర్, ఆగస్టు 13 : పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీ య హోదా ఇవ్వాలని నారాయణపేట ఎమ్మె ల్యే రాజేందర్డ్డి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన వద్ద చేపడుతున్న కురుమూర్తిరాయ రిజర్వాయర్ను ఆ దివారం నారాయణపేట మండలానికి చెందిన 800మంది రైతులతో క లిసి ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొమ్మిదేండ్లలో మొద టి రెండేండ్లు శాఖల విభజన, ఉద్యోగుల సర్దుబాట్ల కు, 18 నెలలు కరోనాకు పోయిందన్నారు. మిగిలిన ఐ దున్నరేండ్లలో.. కాంగ్రెస్ 70 ఏండ్లలో చేసిన అభివృద్ధి కి 10 రెట్లు జరిగిందన్నారు.
30 ఏండ్లలో పూర్తి కాని కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండుగలా ఉండేదని, బీఆర్ఎస్ పాలనలో పండుగలా మారిందన్నారు. రెండేండ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పేట ప్రజలు కలలో కూడా ఊహించని విధంగా మెడికల్ కాలేజీని మంజూరు చేయించుకున్నామన్నారు. పీఆర్ఎల్ఐపై కాంగ్రెస్ నాయకులు 9 కేసులు వేసి అడుగడుగునా అడ్డుకున్నారని, బీజేపీ నాయకులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఏడాదిలో పేట నియోజకవర్గంలోని అన్ని చెరువులనూ నింపుతామన్నారు. పీఆర్ఎల్ఐ కెపాసిటీ 90 టీఎంసీలు అని తెలిపారు. జీవో నెంబర్ 69 వల్ల ఊట్కూర్, కొడంగల్, మద్దూర్ మండలాలకు మాత్రమే నీళ్లు అందుతాయన్నారు. కానీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం ద్వారా కోయిల్కొండ, ధన్వాడ, నారాయణపేట, దామరగిద్ద, మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్, కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్, మద్దూర్, కోస్గి మండలాలతోపాటు మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందుతుందన్నారు.
జీవో నెంబర్ 69 వల్ల నారాయణపేట మండలంలో కేవలం 18వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. అదే పీఆర్ఎల్ఐతో 89వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలియజేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో 12లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. 2009లో పీఎం మోదీ తాము అధికారంలోకి వస్తే పీఆర్ఎల్ఐకి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆశీస్సులతో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందించి రైతుల పాదాలు కడుగుతానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి, వైస్చైర్మన్ లక్ష్మీకాంత్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, రైతుబంధు సమితి సభ్యుడు జగన్మోహన్రెడ్డి, మండల అధ్యక్షుడు రాములు, కార్యదర్శి రవీందర్గౌడ్, నాయకులు చంద్రకాంత్, సుదర్శన్రెడ్డి, జగదీశ్, ప్రతాప్రెడ్డి, చెన్నారెడ్డి, వెంకట్రాములు, శ్రీపాద్, మోహన్నాయక్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
అడ్డాకులతోపాటు గ్రామాలకు ఎలాగైనా సాగునీరు రావాలని మా తండ్రుల కాలం నుంచి చేయని పోరాటం, ప్రయత్నమంటూ లేదు. 2016 నుంచి అడ్డాకులకు సాగునీరు రావాలని ప్రస్తుత జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆల దృష్టికి తీసుకెళ్లగా ఆయన వచ్చి పరిశీలించారు. పలుమార్లు పర్యటించి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి కూడా నివేదించి ఘనపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కాల్వ పనుల కోసం జెడ్పీటీసీ, ఎమ్మెల్యే వెంటపడి పనులు వేగంగా పూర్తి చేయించారు. గత వేసవిలోనే కల్వకుర్తి ఎత్తిపోథల పథకం ద్వారా అడ్డాకుల పెద్ద చెరువుకు సాగునీరు రాగా మేమంతా ఆనందించాం. అడ్డాకుల, కందూరు, శాఖాపూర్, గుడిబండ, రాచాల, పొన్నకల్ గ్రామాలకు ఇంత త్వరగా కృష్ణా నీరు వచ్చి చెరువులు నిండుతాయని అస్సలు ఊహించలేదు. కరివెన ప్రాజెక్టు పూర్తి అయ్యి కాల్వల ద్వారా సాగునీరు వస్తే ప్రతి గుంట భూమి పొలంగా మారుతుంది. ప్రాజెక్టు పూర్తి చేసి, కాల్వల ద్వారా నీరు తేవడం ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. అందుకు రైతులమంతా మద్దతు తెలుపుతున్నాం.
– జితేందర్రెడ్డి, అడ్డాకుల సింగిల్విండో చైర్మన్