గిరిజన రైతుల్లో పోడు సంబురం నెలకొన్నది. శనివారం కొల్లాపూర్ డివిజన్లో 759 మందికి 1,763.80 ఎకరాల పోడు భూమిని పంపిణీ చేశారు. ముక్కిడిగుండంలో అత్యధికంగా 201 మంది కర్షకులను 505.97 ఎకరాలకు ప్రభుత్వం యజమానులను చేసింది. ఇందుకు సంబంధించిన భూ హక్కు పత్రాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అందజేశారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పట్టాలు అందిన రెండ్రోజుల్లోనే రైతుబంధు సాయం ఖాతాల్లో జమ కావడంతో రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. అలాగే సోమవారం గేమ్యాతండా గిరిజన మహిళలు వారి సంప్రదాయ పద్ధతిలో నృత్యం చేస్తూ పొంగిపోయారు. పెట్టుబడి సాయం కూడా అందడంతో ఉత్సాహంగా పంటల సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
కొల్లాపూర్, జూలై 4 : ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో గిరిపుత్రులకు పోడు భూముల పట్టాల పంపిణీ, ఆ వెంటనే పట్టా పొందిన వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతున్నాయి. దీంతో పోడు రైతుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అసాధ్యాన్ని సుసా ధ్యం చేయడం సీఎం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్యని చెప్పవచ్చు. ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అర్హులైన రైతులందరికీ ప ట్టాలను పంపిణీ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యమ దళపతి, సీఎం కేసీఆర్ వల్లనే ఇ దంతా సాధ్యమైంది. పోడు పట్టాలు పొందిన తర్వాత తమకు తెలియకుండానే బ్యాంకు ఖా తాల్లో రైతుబంధు నగదు జమ అయ్యి సెల్ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయని పలువురు గిరిపుత్రులు చెబుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో నే అత్యధికంగా పోడు పట్టాలు పొందిన కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండంలో 201మందికి 505.97 ఎకరాలు, అదే గ్రామపంచాయతీలోని గేమ్యాతండాలో 83మందికి 263.59 ఎకరాలకు సంబంధించిన పట్టాలను అందుకోగా.. వారి వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ మంగళవారం ఆ గ్రామాన్ని సందర్శించింది. పోడు సాగు చేస్తుండగా అటవీ అధికారుల చేతుల్లో దెబ్బలు తిని.. కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరిగిన వారిని సైతం పలకరించగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
మారుమూల నల్లమల అటవీ సరిహద్దులోని ముక్కిడిగుండం, మొలచింతపల్లి, గేమ్యాతండాల ప్రజలు జీల్దార్ చెరువు దిగువన 150 ఎకరాలు, మేకగుండుతువ్వ ప్రాంతంలో 90 ఎకరాలు, జాలోని కొత్తపల్లి ప్రాంతంలో 120 ఎకరాలు, మ్యాదరిబండ ప్రాంతంలో 30 ఎకరాలు, మల్లబస్వాపూర్ ప్రాంతంలో 70 ఎకరాలు, పికిలితిప్పనట్లు ఏరియాలో 50 ఎకరాల అడవులను నరికి సాగు చేసుకుంటూ జీవించేవారు. ఈక్రమంలో పోడు భూములను సాగు చేస్తున్న వారితోపాటు ఎడ్లు, నాగళ్లను తీసుకెళ్లి మొలచింతపల్లి టింబర్ డిపోలో వేశారు. 2012లో ముక్కిడిగుండం గ్రామానికి చెందిన సభావట్ బాష్యానాయక్, సభావట్ సేవ్యానాయక్, కేతావత్ బాలు, ముడావత్ లక్ష్మణ్నాయక్, బాలస్వామి, లింగస్వామితోపాటు మరో ముగ్గురిపై అటవీశాఖ అధికారులు కేసులు పెట్టి జైలుకు పంపారు. దీంతో ఇప్పటికీ వారు కొల్లాపూర్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.
మొండి చెయ్యి చూపిన జూపల్లి
తాము సాగుచేసుకుంటున్న పోడు భూములకు అటవీ అధికారుల నుంచి విముక్తి కల్పించాలని ముక్కిడిగుండం, గేమ్యా తండా ప్రజలు 2011 లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జూ పల్లి కృష్ణారావుకు మొరపెట్టుకున్నారు. కాగా ముక్కిడిగుండం, గేమ్యాతండా, వేడుకరావుప ల్లి, మారెడుమాన్దిన్నె ప్రాంతాల్లోని పోడుభూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి అడవులను నరకొద్దని చెప్పి మొండిచేయి చూపారని బాధితులు బాష్యానాయక్, సేవ్యానాయక్, లక్ష్మణ్నాయక్ గుర్తు చేసుకున్నారు. తొమ్మిదేండ్ల కింద టి వరకు ఎవరొచ్చినా తమను ఓట్ల కోసం వాడుకున్నారే తప్పా.. బతుకుదెరువు చూపలేదని మండిపడ్డారు.
గులాబీజెండాకు జైకొడుతున్న ‘గిరి’జనం
పోడు పట్టాలిస్తామని, పెట్టుబడికి రైతుబంధు పథకం ద్వారా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జ మ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నే డు నిలబెట్టుకోవడంతో గులాబీ జెండాకు ‘గిరి’జనులు జై కొడుతున్నారు. పట్టా సంతోషం మ రువకముందే పెట్టుబడి సాయం చేయడంతో ల బ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా తమకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వా రు ఖరాఖండిగా చెబుతున్నారు. పట్టాల కోసం 40,50 ఏండ్లుగా పోరాడగా సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడుతున్నారు. కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్లోని కొల్లాపూర్ మండలంలో 11 తండాలు, గ్రామాల్లోని 404మందికి 1081. 26 ఎకరాలు, పెద్దకొత్తపల్లి మం డలంలోని ఆరు గ్రామాల్లో 216 మందికి 592.22 ఎకరాలు, కోడేరు మండలంలోని నాలుగు తండా ల్లో 89మందికి 49.98 ఎకరాలు, పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లితండాలో 50మందికి 40.34 ఎకరాల పోడు భూములకు సంబంధించిన పట్టాలను ఈనెల ఒక టో తేదీన ఎమ్మెల్యే బీరం అందజేశారు.
అర్హులందరికీ న్యాయం చేస్తాం
పోడు సాగులో ఉన్న అర్హులందరికీ న్యాయం జరుగుతుంది. కొన్ని చోట్ల సాంకేతికపరంగా జరిగిన లోపాలను గుర్తించి అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయా. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరూ అధైర్యపడొద్దు. క్షేత్రస్థాయిలో జరిగిన రీడింగ్ నమోదులో కొన్ని లోపాలు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది. అది త్వరలోనే పరిష్కారమవుతుంది.
– బీరం హర్షవర్ధన్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే
పెట్టుబడి సాయం అందింది
పోడు పట్టా అందింనందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎకరం 36గుంటల భూమి ఇచ్చారు. ఇంతలోనే నా బ్యాంకు ఖాతాలో రైతుబంధు నగదు రూ.9,500 జమ అయ్యాయి. రెండ్రోజులకే పెట్టుబడి సాయం అందడంతో నాకు రెట్టింపు ఆనందంగా ఉంది. చెప్పింది చేసి చూపెట్టే నాయకుడు సీఎం కేసీఆర్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా.
– దేశావత్ సేవ్యానాయక్, పోడు రైతు, ముక్కిడిగుండం
దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్
పోడు సాగుదారులపై జంగ్లతోళ్లు పెట్టిన కేసులను సీఎం కేసీఆర్ ఎత్తివేస్తామని చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో జంగ్లతోళ్లు మేము సాగు చేసిన పంటలకు నష్టం చేసి, మమ్మల్ని చితకబాది మా పైనే కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడంతో ఆర్థికంగా దెబ్బతిన్నం. ఇప్పుడు నా భార్య పేరు మీద రెండెకరాల పట్టా ఇచ్చిండ్రు. ఇలాంటి దమ్మున్న నాయకుడే మనకు పాలకుడిగా ఉండాలి. ఆయన వెన్నంటే ఉంటా.
– సభావట్ బాష్యానాయక్, పోడు రైతు, ముక్కిడిగుండం
మా బాధలు తొలగినయ్
నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న. ఏటా వానకాలంలో మా నాయన పోడు భూమిలో విత్తనాలు నాటనిక్కె పోతే జంగ్లతోళ్లు గడాలు విడిపించి ఇంటికి పంపేటోళ్లు. ఒక్కొక్కసారి కొట్టెటోళ్లు కూడా. దొంగచాటుగా సాగుచేసినా మరుసటి రోజు వాళ్లొచ్చి పంటను చెడగొడుతుండ్రి. ఇట్లా మా నాయన వాళ్లతో పోరాడుతుండె. నేను చేతికొచ్చినంక కూడా నన్ను కొట్టి.. గడాలను విడిపించి పంపిస్తుండ్రి. సీఎం కేసీఆర్ నా భార్య పేరు మీద రెండెకరాల పట్టా ఇచ్చిండు. మాకు బాధలు తప్పినయ్.
– దేశావత్ సీతానాయక్, పోడు రైతు, ముక్కిడిగుండం