టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి మతిభ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మహబూబ్నగర్ జి ల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మంత్రి విలేకరులతో మా ట్లాడారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హ త్యాయత్నం తీరుచూస్తే బాధాకరంగా ఉందన్నారు. మొండి కత్తి అంటూ రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, మొండిది అయి తే పేగులు ఎలా తెగుతాయని ప్రశ్నించా రు. అరాచకాలు సృష్టిస్తూ గద్దెనెక్కాలనుకోవడం హేయమైన చర్య అన్నారు. పిరికి పందల్లా చిల్లర రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. ప్రజలను రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు ప్రేరేపిస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీకి లక్షలాది మంది సైన్యం ఉందని, ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 31 : రేవంత్రెడ్డి రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటిని తెలంగాణ సమాజం క్షమించదని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ ఎంపీ, దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం దారుణమన్నారు. మొండి కత్తి అని దుర్మార్గంగా మాట్లడడం రేవంత్రెడ్డి మానసిక స్థితిని తెలియజేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించి వారి మనసులు గెలవాలే తప్పా ఇలాంటి అరాచకాలు చేయడం పిరికి పంద చర్యగా మంత్రి అభివర్ణించారు. ఇలాంటి వారిని రాజకీయంగా పూర్తిగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పొరపాటున అధికారం ఇస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందన్నారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటూ కార్యకర్తలను రెచ్చగొట్టి వారితో దాడులు చేయించడం, తిరిగి సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందనే కుట్రతో ప్రభాకర్రెడ్డిని హత్య చేయించేందుకు ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. సీఎం కేసీఆర్కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక కుట్రతో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తల బలగం ఉన్నదని, అనుకుంటే ఇలాంటి వారికి గుణపాఠం చెప్పగలమని, కానీ తమకు ఆ సంస్కృతి లేదన్నారు. ఒక్క క్షణం మా కార్యకర్తలు సహనం కోల్పోతే దాడి చేసిన వాడు ముక్కలు ముక్కలుగా అయ్యేవాడని తెలిపారు. చట్టంపై తమకు అపారమైన గౌరవం ఉన్నదని కార్యకర్తలు నిందితుడిని పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. గన్మెన్లేకుంటే ఆ సమయంలో ప్రభాకర్రెడ్డి పరిస్థితి ఏమిటని, తలచుకుంటనే ఎంతో అవేదన కల్గుతుందని తెలిపారు. కాపాడిన గన్మెన్కు సెల్యూట్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభాకర్రెడ్డి చికిత్సకు సంబంధించిన ఫొటోలను మంత్రి మీడియాకు చూపించారు. పోలీసులను బట్టలూడదీసి ఉరికించి కొడతామని రేవంత్ అన్నారని, టచ్ కూడా చేయలేరని హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ పనితీరుతో దేశంలోనే నెంబర్వన్గా నిలిచారని ప్రసంశించారు. సమావేశంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మూడా చైర్మన్ గంజి వెంక న్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, ము డా డైరెక్టర్ ఆంజనేయులు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, నాయకులు శేఖర్, రామకృష్ణ, కృష్ణయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.