అంతసేపు తోటి మిత్రులతో కలిసి సరదాగా గడిపిన చిన్నారుల జీవితాల్లో విషాదం చోటు చేసుకున్నది. మేకలు కాసేందుకు వెళ్తున్న సురేఖ(28)తో కలిసి ఆమె కొడుకు విజయ్ (8), అక్క కూతుళ్లు లఖిత(7), మమతతోపాటు ఇంటి సమీపంలోని వెంకటేశ్(8) వెళ్లాడు. మేకలు మేస్తుండగా.. సమీపంలోని చెరువులో ఆడుకునేందుకు దిగిన చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు నీట మునిగారు. వెంటనే అప్రమత్తమైన సురేఖ వారిని రక్షించేందుకు వెళ్లి ఆమె నీటి గుంతలో పడి మృతి చెందింది. నలుగురి పాలిట చెరువు మృత్యుపాశంగా మారింది.
నారాయణపేట రూరల్, ఏప్రిల్ 18 : నా రాయణపేట మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో మేకలు కాసేందుకు వెళ్లి ఓ మ హిళతోపాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన మంగళవారం సా యంత్రం చోటు చేసుకున్నది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరా లు ఇలా ఉన్నాయి.. బోయిన్పల్లి గ్రామానికి చెందిన రాములు భార్య సురేఖ(28)మేకలను కాసేందుకు వెళ్ళగా ఆమె వెంట కుమారుడు విజయ్ (8), సురేఖ అక్క కూ తురు లఖిత(7), మమతతో పాటు గ్రామస్తులు నర్సప్ప కుమారుడు వెంకటేశ్(8) గ్రామ శివారులోని చెరువు దగ్గరకు వె ళ్లా రు. ఈ క్రమంలో విజయ్, లఖిత, వెంకటేశ్లు ఈత కొట్టేందుకు చెరువులోకి దిగా రు. ఈతకొడుతూ వారు నీటిలోని పెద్దగు ంతను గమనించక లోనికి వెళ్ళి మునుగుతుండగా వారిని రక్షించేందుకు వెళ్లిన సు రేఖ కూడా నీటిలో మునిగిపోయింది.
చె రువు ఒడ్డుకు ఉండి ఇందంతా చూసిన సు రేఖ అక్క కూతురు మమత పరిగెత్తుకుం టూ గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తులు, కుటు ంబ సభ్యులకు తెలపగా వారంత వెళ్లి మృ తదేహాలను వెలికితీశారు. మగ్రామంలో ఒ కే సారి నలుగురు చనిపోవడంతో విషాధ చాయలు నెలకొన్నాయి. వీరంతా పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నారు. ఈ ఘటనపై మృతి చెందిన చిన్నారి వెంకటేశ్ తండ్రి నర్సప్ప పేట పోలీసులకు తన కొ డుకు చావుపై ఎవరిపై ఎలాంటి అనుమాన ం లేదని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కే సు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.