మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. వీటిని గుర్తించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో యువకుడు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు గుర్తించారు.
మృతులు ఎవరనే విషయాన్ని తెలుసుకొనేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముగ్గురూ దేవరకద్ర చెందిన తల్లి, కుమారుడు, కుమార్తెగా గుర్తించారు. గుడికి వెళ్తున్నామని చెప్పి సోమవారం తల్లీపిల్లలు బయటకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.