మహబూబ్నగర్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధిష్టానం 45 మందితో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. ఇప్పటికే మొదటి విడుత కేటాయింపులో టికెట్లు దక్కని వారి నుంచి ఆగ్రహజ్వాలలు రగులుతుండగా.. తాజాగా రెండో విడుతతో అసమ్మతికి ఆజ్యం పోసినైట్లెంది. సర్వేల్లో గెలుస్తా రని ప్రకటించిన వారి పేర్లు గల్లంతు కావడంతో ఆశావహులు నిరాశకు గురయ్యారు. జడ్చర్లలో ఎర్రశేఖర్కు, దేవరకద్రలో ప్రదీ ప్గౌడ్కు రెడ్ సిగ్నల్ ఇవ్వగా.. వనపర్తిలో మేఘారెడ్డికి, మక్తల్ సీటు ఆశించిన సీతమ్మకు ఊహించని షాక్ తగిలింది. దీంతో పార్టీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. ప్యారాచూట్ నేతలకు టికెట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగం జనార్దన్రెడ్డి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. వెంటనే అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి అందరూ అల్టిమేటం జారీ చేశారు. గెలిచే సత్తా ఉన్నా.. తమకు టికెట్లు ఎందుకు కేటాయించలేదని నిలదీశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే అన్యాయం చేశారని ఆవేదన చెందారు. ఏది ఏమైనా వారికి మద్దతిచ్చేది లేదన్నారు. అవసరమైతే కాంగ్రెస్ రెబల్స్గా రేసులో ఉంటామని కొందరు చెబుతుండగా.. మరికొందరు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
రెండో విడుత కాంగ్రెస్ ప్రక టించిన జాబితా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆ పార్టీ ఆశావ హులను షాక్కు గురి చేసింది. పార్టీలో కష్టపడ్డ వారికి.. సర్వేల్లో గెలుస్తామన్న వారి పేర్లు గల్లంతయ్యాయి. జాబితా ప్రకటించగానే జడ్చర్ల, పాలమూరు, మక్తల్, వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఆందోళన చెందారు. టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్నా చాలా మంది నేతలు ఖంగుతిన్నా రు. మరికొందరు భంగపడ్డారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, దేవరకద్ర మాజీ ఎమ్మె ల్యే సీతమ్మ కు, వనపర్తిలో మేఘా రెడ్డికి మొండిచేయి చూపా రు. పార్టీ టికెట్ కావాలంటే ఎంత డబ్బు ఇవ్వాలని ఛాలెంజ్ చేసిన దేవర కద్రకు చెం దిన టీపీసీసీ అధికార ప్రతినిధి ప్రదీప్గౌడ్కు కూడా టికెట్ కేటాయించక పోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మక్తల్, నా రాయణ పేట నియోజకవర్గంలో చాలామంది నేతలు టికెట్ కోసం ఆశించి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అన్ని నియోజక వర్గాల్లో టికెట్ రాని ఆశావహులు భవిష్యత్ కార్యాచర ణ వెల్లడిస్తామని ప్రకటించారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా బీసీ మైనారిటీకి చెందిన నేతలు టికెట్ కోసం ఆశించారు. అయితే ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికే టికెట్ కేటాయిం చడంతో వారంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. మరికొన్ని చోట్ల తమ నాయకు లకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్న కార్యకర్తలకు కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. తొలి జాబితాలో ప్రకటించిన 8 నియోజక వర్గాల్లో ఇంకా అసమ్మతి చల్లారక ముందే రెండో జాబితా ప్రకటిం చి మరింత అసమ్మతికి ఆజ్యం పోసినట్లయింది.
శేఖర్కు ఎర్ర జెండా
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజ కవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీసీ నేతగా పేరుపొందిన ఎర్రశేఖర్కు కాం గ్రెస్ అధిష్టానం ఎర్రజెండా చూపింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మీద ఆశతో కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆయనకు టికెట్ ఇస్తామని అప్ప ట్లో హామీ ఇచ్చిన విష యం తెలిసిందే. దీంతో ఆయ న మహబూబ్నగర్ నియోజకవర్గం వదిలి జడ్చర్లలో సొంత ఇల్లు కట్టుకొని పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈసారి టికెట్ తనకే ఖాయమని ప్రకటించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ సమావేశాలు నిర్వహించారు. పార్టీశ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు. మండలాల్లోని అన్ని గ్రామాల్లో తిరిగి క్యాడర్ను సమీకరించారు. సర్వేలో కూడా ఎర్రశేఖర్కే అనుకూలంగా ఉన్నదని ఆ పార్టీ నేతలే స్వయంగా ప్రకటించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా ప్రతిష్టాత్మక తీసుకొని విజయవంతం చేశారు. మల్లు భట్టివిక్రమార్క పాదయాత్రలో కూడా ఎర్రశేఖర్ పాల్గొని జడ్చర్లలో సభలు నిర్వ హించా రు. ఇంత చేసినా పార్టీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఖంగు తిన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా చూపిస్తానని ఎర్రశేఖర్ హెచ్చరించారు. సర్వేలలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటే వారికే కేటాయించాలి, కానీ వ్యతిరేకంగా టికెట్లు ఇచ్చారని ఎర్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీతమ్మకు దక్కని అవకాశం
ఉమ్మడి జిల్లాలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా, దేవరకద్ర ఎమ్మెల్యేగా పనిచేసిన సీతక్కకు రేవంత్రెడ్డి షాక్ఇచ్చారు. ఇటీవలే ఆమె భర్త, టీడీపీ మాజీ నేత కొత్తకోట దయాకర్రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో పరామర్శకు వెళ్లినప్పుడు స్వయంగా రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోకి సీతమ్మను ఆహ్వానించారు. అన్నీ సర్దుకుని సీతమ్మ ఆశతో హస్తం పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆమె మద్దతుదారులతో సుదీర్ఘంగా సమావేశమై చివరకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తానని ప్రకటించారు. దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల నుంచి టికెట్ కావాలని ఆశించారు. కానీ చివరకు రెండో జాబితాలో చోటు దక్కకపోవ డంతో సీతమ్మ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె నిన్నటి నుంచి కార్యకర్తలకు అందుబాటులో లేకుండాపోయింది. క్యాడర్ అంతా అయోమయంలో పడింది.
వనపర్తిలో మెగా షాక్
వనపర్తి నియోజకవర్గంలో పెద్దమందడి ఎంపీపీ తూడు మేఘారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి నిరంజన్రెడ్డితో విభేదించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరినప్పటి నుంచి తనకే టికెట్ వస్తుందని హల్చల్ చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి చెన్నారెడ్డి మూడు దశాబ్దాలుగా వనపర్తి నియోజకవర్గంలో పార్టీకి సేవ చేస్తున్నారు. అయినప్పటికీ తనకే టికెట్ వస్తుందని మేఘారెడ్డి ప్రచారం చేసినా చివరకు అధిష్టానం చిన్నన్నకే టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో మేఘారెడ్డి విస్తుపో యా రు. టికెట్ కోసం చి వరి వరకు ఢిల్లీ లో అధిష్టానం వద్ద పడిగా పులు కాసిన.. ఇస్తున్నా మని చెబు తూనే చిన్నారెడ్డి పేరును ప్రకటించిం ది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి తీవ్ర నిరాశతో తిరిగొచ్చారు. వనపర్తిలో కార్యకర్తలు, ఆయన అనుచరులు మాత్రం చిన్నారెడ్డికిచ్చిన టికెట్లు వెనక్కి తీసు కోవాలని, లేకపోతే తమ సత్తా చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్లోకి వెళ్లి టికెట్ తీసుకుని వచ్చి గెలిచి చూపిస్తానని బీరాలు పలికిన మేఘారెడ్డి ఆశలపై కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లింది. దీంతో ఆయన అనుచరులు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చేసిన హల్చల్ ఉత్తుత్తుదే అంటూ నవ్వుకోవడం జనం వంతైంది.
మిగతా నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి
మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అరడజన్ మంది ఆశించి దరఖాస్తు సైతం చేసుకున్నారు. వీరందరినీ షాక్కు గురిచేస్తూ బీజేపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డికే అధిష్టానం టికెట్ కేటాయించింది.. దీంతో ఒబేదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్, వెంకటేశ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. దేవరకద్రలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇక్కడ బీసీ నేతను కాదని ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డికే టికెట్ ఇవ్వడంతో టీపీసీసీ కార్యదర్శి ప్రదీప్గౌడ్ అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇదే కానిస్టిట్యూషన్లో టికెట్ ఆశించిన కొండ ప్రశాంత్రెడ్డికీ అధిష్టానం మొండిచేయి చూపించింది. ఇక్కడ అభ్యర్థిని మార్చాల్సిందే వారు డిమాండ్ చేశారు. మక్తల్ టికెట్ ఆశించిన ప్రశాంత్ కుమార్రెడ్డి, నాగరాజుగౌడ్ను కాదని వాకిటి శ్రీహరికి టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఢీకొనే సత్తా శ్రీహరికి లేదని పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ఇప్పటికే తొలి విడుతలో కేటాయించిన నాగర్కర్నూల్, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గంలో టికెట్ల పంచాయితీలో అసమ్మతి చల్లారకముందే రెండో విడుత జాబితా కాంగ్రెస్ ఆశావహులను నిరాశపరిచింది. ఎన్నికలు దగ్గర పడు తుండడంతో భవి ష్యత్ కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు పార్టీ మారడమా..? లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయడమో చేసి కాంగ్రెస్ అధిష్టా నానికి బుద్ధి చెప్పాలని చూస్తున్నారని తెలిసిం ది. అభ్యర్థిత్వాలను అధిష్టానం మరోసారి ఆలో చించాలని అల్టిమేటం జారీ చేశారు. కాదని మొండిగా వ్యవహరిస్తే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు కేటాయిం చిన వారికి మద్దతునిచ్చే ప్రశ్నే లేదని నాయకులు తేల్చి చెప్పారు.