వనపర్తి, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మొదటి విడుత పూర్తి కాగా.. రెండో విడుత ప్రశ్నార్థకంలో పడింది. వనపర్తి జిల్లాలో మొదటి విడతలో దాదాపు 199 యూనిట్లు అమలు కాగా.. లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకొని జీ వనోపాధి పొందుతున్నారు. గేదెలు, కోళ్ల షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ట్రాక్టర్లు, ఆటోలు సైతం కొనుగోలు చేశారు. అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రెండో విడుతకూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు రావడంతో ద రఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులైనా ఇంకా పథకంలో ఎలాంటి గ్రౌండింగ్ షురూ కాలేదు. మొదటి దశలో లబ్ధిపొంది ఎందరో ఉపాధి పొందుతుండ గా..
రెండో విడుత కు మరెందరో గంపెడాశలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ అవి మండల స్థాయిలో ఉన్నాయి. కనీసం జి ల్లా కార్యాలయానికి కూడా చేరలేదు. కొత్తకోట కు చెందిన 154, వనపర్తికి చెందిన 720 దరఖాస్తుల సమాచారం మాత్రమే జిల్లా కార్యాలయానికి చేరింది. ఇక మిగిలిన మండలాల్లోని అర్జీల వివరాలు ఎక్కడికక్కడే నిలిచిపోయా యి. కొన్ని చోట్ల రెండో విడుతలోనూ మంజూరు ఉన్నప్పటికీ కొత్త ప్రభుత్వంలో ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా స్థాయి లో 874 దరఖాస్తులుంటే, ఒక్కో మండల స్థాయిలో కనీసం 150 దరఖాస్తుల వరకు ఉన్నట్లు సమాచారం. ఇలా జిల్లాలోని 14 మండలాల్లో కలిపి మొత్తం సుమారు 2 వే ల దరఖాస్తుల వరకు రెం డో విడుతలో పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.
ప్రభుత్వం మారినంత మాత్రాన దళితబంధు పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. దళితబంధు వస్తే ఏదైనా వ్యా పారం చేసుకుని ప్రశాంతంగా బతుకుదాం అనుకున్నాం. గిప్పు డు డబ్బులు ఇస్తారా..? ఇవ్వరా..? అనే సందేహాలు నెలకొన్నాయి. అధికారులను అడిగినా సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం నిధులు కేటాయించి దళితబంధు పథకాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
దళితబంధు పథకానికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. రెండో విడుతకు సంబంధించి ఉ న్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. తదుపరి చర్యలు వచ్చిన వెంటనే ఈ ప్రక్రియకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు సాగుతాం.