వనపర్తి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : పల్లెల్లోని మట్టి రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరా జ్ శాఖ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో మట్టి రోడ్ల ఇబ్బందులను తొలగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం చివరలో చర్యలు తీసుకుంటున్నది. జిల్లాలో రూ.29.27 కో ట్లతో 716 పనులను పంచాయతీరాజ్, ఉపాధి హా మీ శాఖల ఆధ్వర్యంలో పనులను గుర్తించారు. ఇం దులో 90 శాతం నిధులు ఉపాధి హామీ పథకం ద్వా రా సమకూరుతుండగా, మరో 10 శాతం నిధులు ప్రజాప్రతినిధుల కోటా నుంచి సమకూరుతాయి. ప ల్లె ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో శా శ్వత పనులు చేపట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా పల్లెల్లో అధ్వానంగా ఉం డే మట్టి రోడ్లను పూర్తిగా మార్పు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మట్టిరోడ్ల వివరాలు సేకరించి వీటన్నింటి నీ మండలాలు, నియోజకవర్గాల వారీగా క్రోడీకరించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా ఈ ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉం డగా వీటితోపాటు అనేక అనుబంధ గ్రామాలున్నా యి. ప్రస్తుతం పల్లెల్లో ఉన్న మట్టి రోడ్లను సీసీ రోడ్లు గా మార్చనున్నారు.
జిల్లాలోని 14 మండలాల వారీగా ఎన్ఆర్ఈజీఎస్ పరిధిలో సీసీ రోడ్లను మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే.. వనపర్తి మండలానికి 42 పనులకు గానూ రూ. 2.46 కోట్లు, అలాగే పెబ్బేరు మం డలానికి 42 పనులకు రూ.2.07 కోట్లు, శ్రీరంగాపురం మండలానికి 27 పనులకు రూ.1.35 కోట్లు, గోపాల్పేట్లో 42 పనులకు రూ.2.38 కోట్లు, రే వల్లిలో 19 పనులకు రూ.1.31 కోట్లు మంజూరయ్యాయి. అలాగే పాన్గల్ మండలానికి 98 పనుల కు గానూ రూ.3.10 కోట్లు, వీపనగండ్ల మండలానికి 55 పనుల కు రూ.1.70 కోట్లు, చిన్నంబాయి లో 44 పనులకు రూ.1.80 కో ట్లు, ఆత్మకూరులో 37 పనులకు రూ.1.40 కోట్లు, అమరచింత, పెద్దమందడి మండలాల్లో 56 పనులకు రూ.2.50 కోట్లు, ఖిల్లాఘణపురంలో 56 పనులకు రూ.2.68 కోట్లు, కొత్తకోట, మదనాపురం మండలాల్లో 71 పనులకు రూ. 2.43 కోట్లు మంజూరయ్యాయి.
జిల్లాలోని పల్లె గ్రామాలకు సీసీ రోడ్డు పనులు మంజూరు కావడంతో నిర్మాణాల సందడి మొదలైం ది. గతంలో మిగిలిన రోడ్లను ఈ దఫాలో సీసీ రో డ్లుగా మార్చనున్నారు. అయితే, నెమ్మదిగా మొదలవుతున్న పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో చేపట్టిన ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్లు పల్లెల్లో కొత్తదనాన్ని ఇస్తున్నాయి. ఎప్పు డు మురికిగా కనిపించే గ్రామాల కాలనీల రోడ్లు సీసీ రోడ్లతో అందంగా కనిపిస్తున్నాయి. వీటికి తోడు ము రికి కాల్వల నిర్మాణాలను చేపడుతుండటంతో గ్రా మాల పరిసరాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
ఏటా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఆర్థిక సంవత్స రం చివరలో సిమెంట్ రోడ్లు మంజూరవుతా యి. ఈ ఏడాది కూడా జిల్లాలో రూ.29.27 కోట్లతో 680 పనులు మంజూరయ్యాయి. వీటన్నింటినీ గడువులోగా పూర్తి చేయిస్తాం. పనుల ను నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. గడువులోగా పనులు చేయని పక్షంలో పనులు రద్దయ్యే అవకాశం ఉంటుంది.