ముస్లింలు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం వచ్చేసింది. సోమవారం సా యంత్రం నెలవంక దర్శనమివ్వడంతో మంగళవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇస్లాం మతంలో రంజాన్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. దానధర్మాలకు ప్రతీకగా ఈ మాసం నిలవనున్నది. ఇస్లాం మతానికి మూలాధారమైన ఖురాన్ ఈ నెలలోనే ఆవిర్భవించింది. ఈ నెలలో ఇస్లాం మత సూత్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అరబ్బీలో ‘రమ్జ్ ’అంటే కాల్చడమని అర్థం. నెలపాటు ఉపవాసదీక్షలతో శరీరం, ఆత్మలోని మలినాలు ప్రక్షాళన కావడంతోపాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మతపెద్దలు చెబుతారు.
మహబూబ్నగర్ టౌన్, మార్చి 11 : నెలవంక దర్శనమివ్వడంతో మహబూబ్నగర్ పట్టణంలో సైరన్ మోగింది. రంజాన్ మాసం వచ్చిదంటూ ముస్లింలు సంతోషంగా తమ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇది పుణ్యాలు మూటగట్టుకునే సీజన్. అల్లా ఆరాధనలో గడిపే మాసం. ఖురాన్లో పేర్కొన్న ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించాల్సిన నియమం ఉపవాస వ్రతం. దీనినే పార్సీ భాషలో రోజా, అరబ్బీలో సౌమ్ అంటారు. ఖురాన్ సంపూర్ణంగా అవతరించిన దినం కూడా రంజాన్ మాసంలోనే ఉం డడం విశేషం. జిల్లా వ్యాప్తంగా మసీదులను సుందరంగా వి ద్యుద్దీపాలతో అలంకరించారు. మహబూబ్నగర్లోని అన్ని మసీదుల్లో తరావీలో ఖురాన్ పఠనం చేస్తారు. ఖురాన్లో 30 పారాలుండగా రోజుకు ఒకటి చొప్పున నెల మొత్తానికి సరిచేస్తారు. కాగా, పట్టణంలోని క్లాక్టవర్, వన్టౌన్, టీడీగుట్ట, న్యూటౌన్, మెట్టుగడ్డ, పద్మావతి, శ్రీనివాసకాలనీలో హలీం సెంటర్లను ఏర్పాటు చేశారు.
కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాంకు మూలస్తంభాలు. వీటిలో హజ్ తప్పా మిగతా నాలుగు సూత్రాలు అమలయ్యేది రంజాన్ నెలలోనే. ఆర్థిక స్థోమత ఉన్న వా రు తప్పకుండా హజ్ యాత్ర నియమాన్ని కూడా సంపూర్ణం చేయాలి.
ఇస్లాంలోకి ప్రవేశించే మార్గమే కలిమా. లా ఇలాహ ఇల్లాల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్ల్లాహ్ (సొలెలాహు అలెహివసొలం). సృష్టికర్త మహ్మద్ అని అర్థం. ఈ సూత్రాన్ని విశ్వసించడంతోపాటు ఆచరించాలి.
రోజుకు ఐదు పూటలు నమాజ్ను పాటించాలి
రోజా, జకాత్(దానధర్మాలు)కు రంజాన్ మాసంలోనే గొప్ప అవకాశం.
నమాజ్ లేనిదే రోజా సంపూర్ణం కాదు. ప్రతి నమాజ్లోనూ కలిమా పఠనం జరుగుతుంది.
హజ్ తప్పా మిగతా మూలస్తంభాలను నిలబెట్టడంలో రంజాన్ మాసం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉపవాసానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది.
ధర్మ నిష్టతో ఉపవాసాలు ఉండాలి. నిర్ణీత సమయాల్లోనే సహార్, ఇఫ్తార్ పాటించాలి. అందరు కచ్చితమైన సమయాన్ని పాటించేందుకే సైరన్ మోగిస్తారు. మంచినే పాటిస్తూ చెడుకు దూరంగా ఉండాలి. ఐదు పూటల విధిగా నమాజ్ చేయాలి. ఖురాన్ పఠనం, సారాంశంపై అవగాహన, అల్లాహ్ నామస్మరణ, చింతన అలవర్చుకోవాలి. రంజాన్లో చేసే ఏ పవిత్ర కా ర్యానికైనా 70 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుంది. అందువల్ల ఈ మాసంలో దానధర్మాలు విరివిగా చేస్తారు. మాసం చివరిలో ప్రతి ముస్లిం ఫిత్రా దానం చెల్లించుకోవాలి. ఆర్థిక స్థోమత ఉన్న వారు జకాత్ దానం చేయాలి.
మత గ్రంథాల ప్రకారం వయోజనులైన స్తీ, పురుషులందరూ విధిగా రోజా దీక్ష పాటించాలి. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుం ది. రంజాన్ అంటే పాపాలను దహించివేయుట అని అర్థం. ఉపవాస దీక్షలనేవి మనిషిలోని చెడు భావాలు, అధర్మం, ద్వేషాన్ని రూపుమాపేవిగా ఉండాలి. సాధ్యమైనంత వరకు పుణ్యకార్యాలు చేపడుతుండాలి.
[ మహ్మద్ ప్రవక్త బోధించిన నియమాల ప్రకారం ఈ నెల రోజులు సూర్యోదయం (సహార్) నుంచి సూర్యాస్తమయం (ఇఫ్తార్) వరకు నీటిని కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి.
రంజాన్ మాసంలో 27వ రోజు రాత్రి షబ్-ఏ-ఖదర్ జ రుపుతారు. ఈ రాత్రుల్లో జాగరణ ఉండి, ప్రార్థన జరిపి తే వెయ్యినెలల పాటు నమాజ్ చేసినట్లు భావిస్తారు.