గురువారం నెలవంక కనిపించింది.శుక్రవారం నుంచి రంజాన్ మాసం మొదలైంది. తెల్లవారుజాము నుంచే ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. నెల రోజులు సూర్యోదయ సమయంలో ‘సహర్’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే ‘ ఇఫ్తార్’ వరకు మంచి నీళ్లు సైతం తాగకుండా కఠిన ఉపవాసం చేస్తారు. ఆధ్యాత్మికతకు, దానధర్మాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. రోజుకు ఐదుసార్లు ప్రార్థనలు చేయనున్నారు. విద్యుద్దీపాల కాంతుల్లో మసీదులను అందంగా ముస్తాబు చేశారు.
– నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/ మహబూబ్నగర్ టౌన్, మార్చి 23
నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ)/మహబూబ్నగర్ టౌన్/ వనపర్తి టౌన్, మార్చి 23 : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్. నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో పర్వదినాన్ని జరుపుకొంటారు. గురువారం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ఈ మాసం ప్రారంభమైంది. సౌదీ లో కనిపించిన మరుసటి రోజే ఇక్కడ షురూ అవుతుంది. పండుగ సైరన్ మోగడంతో ముస్లింల మోములో చిరునవ్వు పూసింది. రంజాన్మాసం వచ్చిదంటూ సంతోషంగా బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
నియమ నిష్టలతో..
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక ఈ పం డుగ. తెల్లవారు జామున భోజనం చేసిన తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు. మళ్లీ సూర్యాస్తమయంలోనే దీక్షను విరమిస్తారు. ఉదయం తీసుకునే ఆహారాన్ని సహర్, సాయంత్రం తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అంటారు. ఇలా రోజులో 13 గంటల పాటు అబద్ధం ఆడకుండా, పరనిందలకు పాల్పడకుండా, దూషించకుండా, కోపగించకుండా కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ప్రతి ముస్లిం ఉపవాస దీక్షలను పాటి స్తారు. చెడుకు దూరంగా ఉంటూ మంచినే పాటించాలి. ఖు రాన్ పఠనం, సారాంశంపై అవగాహన, అల్లాహ్ నామస్మర ణ, అల్లాహ్ చింతన ఆచరించాలి. అందరూ ఒకేసారి కచ్చిత మైన వేళలు పాటించేందుకు వీలుగా సైరన్ మోగించనున్నా రు. నిత్యం ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ మాసంలోని 27వ రోజు షబ్-ఏ-ఖదర్ నిర్వహిస్తారు. ఈరోజు రాత్రి జాగారం ఉండి, ప్రార్థనలు చేస్తే వెయ్యి నెలల పాటు నమా జు చేసినట్లు ముస్లింలు భావిస్తారు. ప్రార్థనల కోసం మసీదులను విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు.
దానధర్మాలు
పేదలకు ఓ పూట భోజనం పెడుతారు. రంజాన్లో చేసే ఏ పవిత్ర కార్యాలకైనా 70 రెట్ల పుణ్యం అల్లాహ్ ప్రసాదిస్తారని వారి నమ్మకం. పసిపిల్లల నుంచి పెద్దల వరకు ముస్లింల హృదయాలు పవిత్ర భావంతో నిండిపోతాయి. పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన మాసం కావడంతో స్వర్గం తెరి చి ఉంటుందని వారి విశ్వాసం. మాసపు చివరిలో ప్రతి ముస్లిం ఫిత్రా దానం చెల్లించుకోవాలి. ఆర్థిక స్థోమత ఉన్న వారు జకాత్ దానం చేయాలి.
తరావీలో ఖురాన్ పఠనం
అన్ని మసీదులోనూ తరావీలో ఖురాన్ పఠనం చేస్తారు. పవిత్ర ఖురాన్లో 30 పారాలుంటాయి. రోజుకు ఒక పార చొప్పున నెల మొత్తానికి సరిచేస్తారు. ప్రస్తుత కాలంలో ఖురాన్ కంఠస్తం చేసే (హాఫీజ్ల) సంఖ్య మెరుగ్గా ఉండటం వల్ల ప్రతి మసీదులోనూ రంజాన్ మాసంలో ఒక హాఫీజ్ను ఏర్పా టు చేసుకొని నెల మొత్తం సంపూర్ణంగా ఖురాన్ పఠనంతోనే తరావీ నమాజులు పాటిస్తున్నారు.
హలీం ఘుమఘుమలు
రంజాన్ మాసంలో హలీం, హర్రీస్ వంటకం ప్రత్యేకం. సా యంత్రం ఉపవాస దీక్ష విరమించాక ముస్లింలు ఇఫ్తార్గా ఈ వంటకాన్ని ఎక్కువగా తింటారు. రుచితో పాటు ఆరోగ్యకా రకం కావడంతో ఈ వంటకాన్ని అందరూ ఇష్టపడుతారు.
ఐదు సూత్రాలే మూల స్తంభాలు
కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాంకు మూలస్తంభాలు. వీటిలో హజ్ తప్ప మిగతా నాలుగు సూత్రాలు అమలయ్యేది ఒక రంజాన్ నెలలోనే.. ఆర్థిక స్థోమత ఉన్న వారు హజ్ యాత్ర నియమాన్ని సంపూర్ణం చేయాలి.