– ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా నూతన బ్రాంచ్ కార్యదర్శి జె.గట్టయ్య
రుద్రంపూర్, ఆగస్టు 13 : కార్మికుల సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా నూతన బ్రాంచ్ కార్యదర్శి జె.గట్టయ్య అన్నారు. గురువారం కొత్తగూడెం ఏరియా స్టోర్స్ను ఆయన సందర్శించి కార్మికులను కలిశారు. నూతనంగా బ్రాంచ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన గట్టయ్యకు ఏరియా స్టోర్స్ కార్మికులు ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్టోర్స్లో అవసరమైన మేరకు మ్యాన్ పవర్ను పెంచాలని, కార్మికులకు ప్లే డేలు, పీహెచ్డీలను పెంచడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం ఏరియా స్టోర్స్ డీజీఎం మైనేని శ్రీనివాసరావును గట్టయ్య మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. స్టోర్స్లో పని పరిస్థితులు, సిబ్బంది కొరత, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో ఏఐటీయూసీ రాజీపడే ప్రసక్తే లేదని గట్టయ్య స్పష్టం చేశారు.
ఏరియా స్టోర్స్కు సంబంధించిన సమస్యలపై ఇప్పటికే అధికారులతో చర్చలు జరుపుతున్నామని, ఒక్కో సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు.కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.త్వరలోనే పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్,ఆర్.సి. హెచ్.పి పిట్ కార్యదర్శి సురేందర్,ఏరియా స్టోర్స్ పిట్ కార్యదర్శి,కమల్(శ్రీనివాస్) , ఎస్ & పి సి పిట్ కార్యదర్శి రాంబాబు ,నాయకులు రాజాలపూడి సాంబమూర్తి ,,అవినాష్,వేముల నరేష్, లికిత్,సాగర్,సురేష్,రాజేష్,మెయిన్,గావిని నాగరాజు, పడాల కృష్ణ,డి ఎల్ ఆర్ కార్మికులు పాల్గొన్నారు.