‘పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బ్లాక్ మెయిలర్.. చట్టాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో అవినీతి పనులు చేస్తుండు.. మహానేతల పేర్లు చెబుతూ తనకు తాను గొప్పోడిగా ఫీలవుతున్నాడు.. గొప్పోళ్ల పేర్లు చెబితే పెద్ద మనిషివి కావని.. మంచి పనులు చేస్తే ప్రజలే ఆదరిస్తారు’.. అని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్రలో రూ.24.5 కోట్లతో నిర్మించిన ఆర్వోబీని, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె, ఎమ్మెల్యే ఆల, ఎమ్మెల్సీ కశిరెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ పాలమూరు గడ్డ ఎందరో రత్నాల్లాంటి నాయకులను ఇచ్చిందన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ అత్యంత అవినీతి అసమర్థ ప్రధాని మోదీ అని విమర్శించారు. సర్వేల్లో ఎమ్మెల్యే ఆల పనితీరు బాగుందని రిపోర్ట్ వచ్చిందన్నారు.
– మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దేవరకద్ర, మే 8
మహబూబ్నగర్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దేవరకద్ర : ఈ జిల్లాలో పుట్టి పెరిగిన బూర్గుల రామకృష్ణారావు, జైపాల్రెడ్డి ప్రజల కోసం, ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన గొప్పోళ్లు కాగా, ఒక చట్టాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మేయిల్ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి రేవంత్రెడ్డి అని రోడ్డు భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. దేవరకద్రలో 24.5కోట్లతో నిర్మించిన ఆర్వోబీ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం దేవరకద్రలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ బ్లాక్మెయిలర్ అని విరుచుకుపడ్డారు.
మహబూబ్నగర్ రత్నాల్లాంటి బూర్గుల రామకృష్ణారావు, జైపాల్రెడ్డిలాంటి వాళ్లతోపాటు తనను ఇచ్చిందని గొప్పలకు పోతున్నావు.. నిజమే బిడ్డ.. ఇక్కడ పుట్టిన బుర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయిండు.. జైపాల్రెడ్డి కేంద్రమంత్రి అయిండు..వాళ్లకు తెలిసినంత మంచి పనులు చేసిండ్రు..నీవు కూడా అదే కోవలో అనుకుంటున్నావ్.. ఇది నీ పిచ్చి.. వాళ్ల కాళ్లగోటికి కూడా సరిపోవని విమర్శించారు. పెద్దోళ్ల పేర్లు చెప్పినంత మాత్రాన పెద్దోడివి కావన్నారు. మహబూబ్నగర్ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసినవ్.. పాలమూరు ప్రజలు అమాయకులు కారని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసించిపోయిం ది.. ఆ పార్టీ పరిస్థితి ఎంత అధ్వాన్నం అయిందంటే.. పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎంపీ పదవిని దుర్మాగమైన మోదీ తొలగించిండు.. అయిన ఆ పార్టీ కార్యకర్తలు సప్పుడు చేస్తలేరు.. ఇక పార్టీ పని అయిపోందని అన్నారు. ఢిల్లీలో ఆయన ఉంటున్న ఇంటి నుంచి కూడా బలవంతంగా బయటకు పంపించారు.. ఇంత చేస్తున్నా ఆ పార్టీ నేతలు మాట్లాడతలేరు.. ఇక్కడేంది పార్టీ అని అన్నారు.
బీజేపీ పార్టీలో తెలివిలేనోళ్లు చాలామంది ఉన్నరు.. నెత్తిమీద వెంట్రుకలు కూడా లేవు అని చురకలు అంటించారు. నరేంద్రమోదీ అంతా అవినీతిపరుడు..అసమర్థ ప్రధాని దేశంలో ఇప్పటివరకు లేరని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలన్నీ అమాం తం పెరిగాయన్నారు. మోదీ పుణ్యమా అని నెలకు రూ.3వేలనుంచి 4వేలు ఎక్కువ ఖర్చవుతుందన్నారు. ధరలు పెంచినోడు సమర్థుడా? అసమర్థుడా? మీరే నిర్ణయించాలన్నారు. మన ప్రజల డబ్బును అప్పనంగా ఆదానీకి అప్పగిస్తున్నారు.. ఆదానీతో డబ్బులు తీసుకుని వేరే రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఈ దేశంలో వేరే పార్టీ ఉండకుండా చేస్తున్నడని..బీజేపీ విధానాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎంపీపీ రమాదేవి, అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, భూత్పూర్ ఎం పీపీ కదిరె శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్, చిన్నచింతకుంట ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, శ్రీకాంత్యాదవ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు కంచుకోట దేవరకద్ర
దేవరకద్ర నియోజకవర్గంలో ఏడుగురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 86శాతం మంది సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారంటే ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న నమ్మకం గొప్పదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం కేసీఆర్ దేవరకద్రకు వందలకోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేస్తున్నారన్నారు. ఎల్లప్పుడు గ్రామాల్లో ఉండి పని చేసుకునే అతికొద్ది ఎమ్మెల్యేల్లో మీ ఎమ్మెల్యే ఒకరన్నారు. మా వద్దకు ఎప్పుడొచ్చినా పిల్లలు చాక్లెట్లు అడిగినట్లు ఫ్లీజ్ అబ్బా.. ఇవ్వమని అడిగినట్లు మీ కోసం పనులు అడుగుతారని, మీ ఎమ్మెల్యే అంటే సీఎంకు గొప్ప ప్రేమ ఉండడంతోనే ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్అండ్బీ డిపార్ట్మెంట్ పనులన్నీ సీఎం ప్రేమతో వచ్చినవన్నారు. సీఎంకు ఫైల్కు పంపి సార్.. ఆల వెంకటేశ్వర్రెడ్డి అడుగుతున్నాడని చెబితే వెంటనే మంజూరు చేస్తున్నారని.. అంతటి నమ్మకాన్ని సాధించారన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను నేను, మీ జిల్లా మంత్రి శ్రీనివాస్గౌడ్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ మధ్య రెండు, మూడు సర్వేలు వచ్చినయి.. మీ ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్ పార్టీకి 65శాతం ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.. మిగతా వాళ్లు ఆ 35శాతంలోనే కొట్టుకోవాలే.. మీ ప్రేమ, ఆదరాభిమానం.. పేదలకు ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కలగలిపి మీ నియోజకవర్గం ముందు వరుసలో ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా ఉండి.. రాష్ట్రంలో గెలిచే సీట్లల్లో దేవరకద్ర ముందువరుసలో ఉంటుందని కార్యకర్తలు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పాలమూరు కరువు కన్నీళ్లను చూసి చలించపోయా. మనకంటే ముందు 70ఏండ్లు పరిపాలించినోళ్ల పాలనలో ఏం చేసుకుంది మహబూబ్నగర్..? కరువు తప్ప.. చేసిందేమీలేదన్నారు. రాజకీయాల్లో రాకముందు బిల్డర్గా పనిచేశా. .బిల్డింగ్లు కడుతుంటే వచ్చిన కూలీలను అడిగా.. మాది పాలమూరు సార్ అంటే చాలా ఆవేదన కలిగేదన్నారు.
ఉద్యమ సమయంలో ఆర్డీఎస్పై పాదయాత్ర చేసేటప్పుడు కేసీఆర్తో కలిసి నడిచాం.. ఇక్కడ చూసిన పేదరికం..కరువు చూసి కడుపు తరక్కుపోయిందన్నారు. మా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి పరిస్థితి లేకుండే అని అన్నారు. ఈ తొమ్మిదేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశారు. మెల్లమెల్లగా పాలమూరు జిల్లా పచ్చబడుతుంది. వలసలు పోయినోళ్లు తిరిగి వచ్చారన్నారు. నీళ్లు రావడంతో పొలం పనులు పెరిగాయి.. ఇవాళ వలసలకు నిలయమైన పాలమూరు జిల్లాలో వేరే రాష్ర్టాల వాళ్లు వచ్చి కూలీపని చేస్తున్నారంటే గర్వకారణమని, ఈ మార్పునకు కారణం ఎవరూ కేసీఆర్ కాదా అని, ఇది విపక్షాలకు కనిపిస్తలేదా అని ప్రశ్నించారు.
మీ ఎమ్మెల్యేకు అండగా నిలువాలి : ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్వోబీని సాధించి పూర్తి చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి అందరూ అండగా నిలువాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. 70ఏండ్లు పరిపాలించిన పార్టీలు ఈ జిల్లాకు చేసిందేమిటో కార్యకర్తలు గుర్తించాలన్నారు. ఓట్లు వేయించుకుని పబ్బం గడిపారే తప్ప.. ప్రజల బాగోగులు పట్టించుకోలేదన్నారు. రూ.75 పింఛన్ ఇచ్చి, ఇక్కడ ఉన్నోళ్లను బొంబాయి ఇతర పట్టణాలకు వలస పోయేలా చేశారన్నారు. కరెంట్ సక్కగా ఇవ్వలేదు..రైతులను ఆగం చేసిం డ్రు.. మూడు గంటల కరెంట్ ఇవ్వడం వల్ల ఎంతోమంది పాము, తేళ్లు కరిచి చనిపోయారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తున్నారని, పక్కన ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు ఇస్తలేరని మంత్రి ప్రశ్నించారు. గతంలో చెక్డ్యాంలు కట్టలేదని, ఆ ఆలోచనే అప్పటి పాలకులకు రాలేదన్నారు. ఇదే చెక్డ్యాంలు కడితే మనం బొంబాయికి పోయేటోళ్లమా? నీళ్లించింటే వలసపోయే వాళ్లమా? అని ఆలోచించాలని కోరారు.
గతంలో ఎవరూ పట్టించుకోలేదు : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
దేవరకద్రలో ఆర్వోబీ నిర్మించాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా మొరపెట్టుకున్నా గత పాలకులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కేంద్రం సహకరించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ను అడిగిన తక్షణమే రూ.24.5కోట్లు మంజూరు చేసి ప్రజల కష్టాలను దూరం చేశారన్నారు. ప్రతిపక్షాలకు ఓట్లు తప్ప ప్రజల బాగోగులు పట్టవని, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతయ్యేలా తీర్పు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో వేలాదిమంది లబ్ధి పొందుతున్నారని, బీఆర్ఎస్కు ఓటేస్తే వాళ్ల డిపాజిట్లు మాయం అవుతాయన్నారు.
భారీ మెజార్టీతో గెలిపించాలి : ఎమ్మెల్సీ కశిరెడి నారాయణరెడ్డి
మీ ఎమ్మెల్యేకు ఎప్పుడూ అభివృద్ధి, ప్రజాసంక్షేమమే ధ్యాస అని.. అలాంటి ఎమ్మెల్యేను గెలిపిస్తే పట్టుదలతో మరింత అభివృద్ధి సాధిస్తారని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆలను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
‘పాలమూరు’ ఆగదు
కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్పప్పుడే తెలంగాణ వచ్చిందని, పాలమూరు అంటే అమితమైన ప్రేమ ఉందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మొదట చిన్నచిన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆరేడు నియోజకవర్గాలకు నీటి ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. కరివెన రిజర్వాయర్ పూర్తి చేసుకుంటే గ్రావేటీతో కోయిల్సాగర్ ప్రాజెక్టులో 365 రోజులపాటు నీళ్లు నింపొచ్చన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఆంధ్రవాళ్లు పేచి పెడుతున్నారు.. కేంద్రం సహకరిస్తలేదన్నారు. కృష్ణా నీళ్ల వాటా తేల్చడంలేదని, అయినప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకోవాలని కంకణబద్ధులై పని చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ్ల పాలమూరు జిల్లా పచ్చబడుతుండగా.. కాంగ్రెస్, బీజేపీ నేతలు పసలేని మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
అట్టహాసంగా.. దేవరకద్ర ఆర్వోబీ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ప్రారంభం
దేవరకద్ర, మే 8 : దేవరకద్ర పట్టణంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రూ.24కోట్ల 50లక్షలతో నిర్మించిన ఆర్వోబీని మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రారంభించారు. అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న రైల్వేగేట్తో రాయిచూర్, గోవా తదితర సుదూర ప్రాం తాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. సీఎం కేసీఆర్తో ఎమ్మెల్యే ఆల మాట్లాడి ఆర్వోబీ నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు. ఆర్వోబీ పనులు పూర్తి కావడంతో మంత్రు లు, ఎంపీ, ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు అట్టహాసంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల డోలు కొట్టి కార్యకర్తలను ఉత్తేజపరిచా రు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయా న్ని ప్రారంభించారు.
‘కల్యాణలక్ష్మి’ ఫైల్పై తొలి సంతకం
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటగా కల్యాణలక్ష్మి ఫైల్పై ఎమ్మెల్యే ఆల తొలి సంతకం చేసి తాసిల్దార్ జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మం డలాల ప్రజలకు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తె లిపారు. ఆర్వోబీ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ప్రా రంభోత్సవం సందర్భంగా నియోజకవర్గంలో ని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.