దేవరకద్ర, సెప్టెంబర్ 10 : జిల్లాలోని భారీ నీటిపారుదల కోయిల్సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి జళకళ సంతరించుకున్నది. కోయిల్సాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతున్నది. తీలేరు పంప్హౌస్ నుంచి కృష్ణా జలాలను కోయిల్సాగర్ ప్రాజెక్టులోకి తరలిస్తుండటంతో ప్రాజెక్టులో ఆదివారం నాటికి 31.2 అడుగులకు నీరు వచ్చి చేరింది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.5 అడుగులకు గానూ మరో 1.4 ఫీట్ల మేర నీరు వస్తే ప్రాజెక్టు గేట్లను తెరువనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.