హన్వాడ, ఏప్రిల్ 10 : వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతోనే పంట సా గు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కు టుంబాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరువు వ చ్చిందని ఆరోపించారు. బుధవారం మండలంలోని అమ్మటోనిపల్లి గ్రామంలో ఎండిన వరి పం టలను మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మ న్నె శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంత సాగు చేశారు.. ఎంత ఎండిపోయింది.. పంట సాగు చేసేందుకు ఎంత ఖర్చు చేశారని రైతుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మాజీ మం త్రి మాట్లాడుతూ మండలంలో 50శాతం వరకు పం టలు ఎండిపోయాయి. పంట సాగు చేసేందుకు ఎకరా కు రూ.30వేలు ఖర్చు అయ్యిందని, చేతికొచ్చే సమయంలోనే పంటలు ఎండిపోవడంతో రైతులు ఏమి చేయాలో తోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ పదేండ్లు అధికారంలో ఉంటే ఒక్క పంట కూడా ఎండిన దాఖలాలు లేవు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి సాగునీరు, ఉచిత కరెంటు, పంట పెట్టుబడి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిచామన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ.5లక్షల బీమా ఇచ్చి ఆదుకున్నట్లు వివరించారు.
ఇలాంటి పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెడుతున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు, కరెంట్, రైతుబంధు, రైతు బీ మా లేక రైతులు దిక్కుతోచని స్థి తిలో పడ్డారని వాపోయారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు రూ. 2 లక్షల రుణమాఫీ, రైతుబంధు రూ.15 వేలు, వడ్లకు మద్దతు ధర, రూ.500 బోనస్, రైతు కూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని సూ చించారు. తాగునీటి కోసం కూ డా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రభుత్వం వెంటనే తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవడంతోపాటు ఎండిపోయిన పంటలకు ఎకరా కు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీ మన్నె మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు పంటలు పరిశీలించడం లేదని, రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసి నా పంటలు పుష్కలంగా పండాయని, ఆ పరిస్థితులు ఏమయ్యాయన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, మీ తరఫున బీఆర్ఎస్ పోరాటం చేసి అండగా నిలుస్తుందన్నారు. అందుకే రైతులను ఆదుకోని కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సింగిల్విండో చైర్మన్ వెంకట య్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ నరేందర్, మాజీ వైస్ ఎంపీపీ కొండా లక్ష్మయ్య, ఎంపీటీసీలు వడ్ల శేఖర్, అరుణ్, చెన్నయ్య, మల్కయ్య, నాయకులు జంబులయ్య, రమణారెడ్డి, బసిరెడ్డి, యాదయ్య, చెన్న య్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేను మూడు ఎకరాలల్లో వరిపంట ను సాగు చేస్తే ఎకరన్నర పంట ఎండిపోయింది. వరి సాగు చేసేందు కు ఎకరాకు రూ.30 వేలు ఖర్చు అయిం ది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోయింది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కూడా అందించలేదు. పదేండ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రభుత్వం పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలి.