హన్వాడ, జనవరి 29 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అ మలు చేస్తున్న హరితహారంలో నాటిన మొక్కలను నిర్లక్ష్యం గా నరికివేస్తున్నారు. మండలంలోని వేపూర్ ప్రధాన రహదారికి ఇరువైపులా విద్యుత్ వైర్ల కింద హరితహారం మొక్క లు నాటారు. అలాగే హన్వాడలో పలు వార్డులు, పూజారితండా వద్ద బీటీ రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ తీగల కింద హరితహారం మొక్కలు నాటారు.
మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. ముందుగా అధికారులు ఆలోచన చేయకుండా విద్యుత్ వై ర్ల కింద మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి ఇప్పుడు పెద్ద వృక్షాలుగా మారడంతో వైర్లకు తాకడంతో వాటిని అధికారులు నరికివేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి ఏటా రూ.వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో వృథా అవుతున్నది.