మహబూబ్నగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మన ప్రాజెక్టుల నిర్వహణపై కాంగ్రెస్ ప్ర భుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వచ్చి రెండు నెల లు కూడా కాకముందే పలు డ్యాంలను కృష్ణా నీటి యా జమాన్య బోర్డుకు అప్పనంగా అప్పగించింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. దీంతోపాటు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రా న్ని కూడా కేంద్రం స్వాధీనం చేసుకోవడం తీవ్ర ప్రభా వం చూపుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైన మహబూబ్నగర్ జిల్లాలో మళ్లీ నాటి దుస్థితి తలెత్తే అవకాశం ఉన్నదని మేధావులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానది రాష్ట్రంలో ప్రవేశించేది ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అయినా ఆరు దశాబ్దాలుగా నీళ్లు లేక ఈ ప్రాంతాన్ని ఎండగట్టారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక పెండింగ్ ప్రాజెక్టులు కం ప్లీట్ చేసుకుని.. 2018 నుంచి సాగునీరు పుష్కలమైంది.
దీంతో గతంలో బీళ్లుగా ఉన్న భూములు సైతం సాగుకు అనుకూలంగా మారాయి. పచ్చని పంటలతో ఈ ప్రాంతం మరో కోనసీమను తలపిస్తూ సస్యశ్యామలమైంది. బంగారు పంటలు పండించడంతోపాటు భూ ముల ధరలకు రెక్కలు రావడంతో రైతులు ఆర్థికంగా ఎదిగా రు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల రూపురేఖలే మారాయి.
ఉమ్మడి జిల్లాపై ప్రభావం..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభు త్వం రావడంతో ఒక్కసారిగా అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. ఈలోపు కేంద్రం జల శక్తి శాఖ కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడంతో ఉ మ్మడి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ప్రభుత్వం మారినా ఈ జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయినప్పటికీ రాష్ట్రం చేతులెత్తేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని, శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాన్ని అప్పజెప్పడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. అంతేగాక జూరాల ప్రాజెక్టుపై నిర్మించిన భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. ఈ ప్రాజెక్టులన్నింటికీ బచావో ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నికర జలాల కేటాయింపు కూడా ఉన్నది. ఎగువ, ది గువ విద్యుత్ కేంద్రాలు కూడా నిర్మించారు. ప్రస్తుతం ఈ అన్ని ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి శనివారం జూరాల ప్రాజెక్టుపై రైతులతో ధర్నా కు దిగి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
ఎంజీకేఎల్ఐ సైతం అప్పగింత..
ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్వాధీనం చేసుకున్నది. ఈ ఎత్తిపోతల ప థకం కింద కందనూలు జిల్లాలోని కొల్లాపూర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు సాగునీటిని అందిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా మి షన్ భగీరథ పథకాన్ని ఏర్పాటు చేసింది.
ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాలు, 81 మండలాలకు తాగునీరు అం దించే ఈ పథకం ద్వారా అనేక ఆవాసాలకు రోజూ న ల్లా ద్వారా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం కేంద్ర ఆధీనంలోకి వెళ్లడంతో తీవ్ర ప్రభావం పడుతున్నది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పాలమూరు వరప్రదాయినిగా మారింది. కృష్ణానదికి ఎప్పుడు వర ద వచ్చినా కల్వకుర్తి లిఫ్టులు ఓపెన్ చేసి కిందికి నీళ్లు వదిలేటోళ్లు.. ప్రస్తుతం బోర్డు పరిధిలోకి వెళ్లడంతో కేంద్రం నిర్వహించిన ప్రకారంగానే సాగునీరు అందే అవకాశం ఉన్నది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లా మళ్లీ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం..
కేంద్రం శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నది. దీంతో విద్యుత్ వినియోగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. ఈ విద్యుత్ కేంద్రంలో ఎక్కువగా ఉమ్మడి జిల్లా వాటా ఉన్నది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కూడా బోర్డు పరిధిలోకి వెళ్లడంతో భవిష్యత్తులో కరెంట్ కష్టాలు తప్పేలా లేవు.
ఇక మొత్తం కేంద్రం కనుసన్నల్లోనే ఉండనున్నది. దీం తో ఉమ్మడి జిల్లాకు రావాల్సిన వాటాలో కోతపడే అవకాశం ఉన్నదని మాజీ విద్యుత్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఉత్పత్తి అయిన మొత్తం విద్యుత్ను పంపిణీ చేయాలన్నా కేంద్రం నిర్ణయమే ఉంటుందే తప్పా రాష్ర్టానికి సంబంధం ఉండదని అంటున్నారు. ఇటు జూరాల వద్ద నిర్మించిన ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాలపై కూడా ప్రభావం ఉండనున్నది. వరద వచ్చినప్పుడు వాడుకునే అవకాశం ఉండేది.. ఇప్పుడు అంతా కేంద్రం చెప్పినట్లు వినాల్సిందే..
మరో మూడు ప్రాజెక్టులపై..
కృష్ణానది జలాల వినియోగం కోసం అప్పట్లో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు నికర జ లాలను కేటాయించింది. భీమా ప్రాజెక్టుకు 20 టీఎంసీలు, నెట్టెంపాడు ప్రాజెక్టుకు 20 టీఎంసీలు, కోయిల్సాగర్ ప్రాజెక్టుకు 10 టీఎంసీల చొప్పున నిర్ణయించిం ది. జూరాల ప్రాజెక్టు కూడా లక్ష ఎకరాలకు నీరు అం దేలా డిజైన్ చేశారు. కుడి, ఎడమ కాల్వలతోపాటు సమాంతర కెనాల్కు వరద వచ్చినప్పుడు కిందికి వదిలే అవకాశం ఉండేది. ఇప్పుడు నీటివిడుదల మొత్తం కేం ద్రం చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఉమ్మడి పాలమూరు జి ల్లాలోని ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. రివర్ బోర్డు చేతిలోకి ప్రాజెక్టులు వెళ్లడంతో సాగునీటతోపాటు మంచినీటికీ క ష్టాలు తప్పవని పలువురు సూచిస్తున్నారు.