హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తుతున్నది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. బుధవారం జూరాలకు 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఆ మేరకు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.
రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ మట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 126.97 టీఎంసీలకు చేరుకున్నది. సాగర్కు సైతం 22వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాణహిత వద్ద 87వేల క్యూ సెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా, సమ్మక్కసాగర్ వద్ద 2.69 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్ వద్ద 3.41లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.