హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గత వానకాలం సీజన్తో పోలిస్తే ఈ సారి 10 శాతం మేర అధిక విస్తీర్ణంలో పంటలు సాగైనట్టు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. యూనివర్సిటీలో నిరుడు ఏర్పాటుచేసిన సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలోని రిమోట్సెన్సింగ్ అండ్ జీఐఎస్ వ్యవస్థ సేకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల విశ్లేషణ ద్వారా తాజా పంటల విస్తీర్ణం వివరాలను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య బుధవారం విడుదల చేశారు.
2026 జూలై 29 వరకు రాష్ట్రంలో సాధారణ పంటల విస్తీర్ణం సుమారు 98.13 లక్షల ఎకరాలు కాగా, అందులో సుమారు 33 లక్షల ఎకరాల విస్తీర్ణంలో(34శాతం)ఇప్పటికే వివిధ పంటలు వేసినట్టు తెలిపారు. నిరుడు ఇదే సమయంతో పోలిస్తే 24.65 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఈసారి దానికి మించి 10 శాతం అధికంగా సాగైనట్టు చెప్పారు. అత్యధిక విస్తీర్ణంలో పంటలు వేసిన జిల్లాల్లో యాదాద్రిభువనగిరి(57శాతం), మేడ్చ ల్ మలాజిగిరి(54శాతం), జనగామ(51శాతం) ఉన్నాయి. తకువ విస్తీర్ణంలో విత్తనాలు నాటిన జిల్లాల్లో ఖమ్మం(16.5 శాతం), వనపర్తి(17.3 శాతం), వరంగల్ (20.1శాతం) చివరి మూడు స్థానాల్లో ఉన్నట్టు వివరించారు. వరి, పత్తి, మొకజొన్న పంటలు సాగు విస్తీర్ణంలో సింహభాగం ఆక్రమించాయని వెల్లడించారు.