అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్ర మే గడువు మిగిలింది. మంగళవారంతో ప్రచార ఘ ట్టం ముగియనున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో క్యాంపేయిన్ స్పీడప్ అందుకున్నది. బీఆర్ఎస్ శ్రే ణులు గ్రామగామాన.. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చే స్తున్నారు. మ్యానిఫెస్టోతోపాటు అభివృద్ధి, సంక్షేమా న్ని వివరిస్తున్నారు. ఇప్పటికే అధినేత, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు, మంత్రి కేటీఆర్ రోడ్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ ఆధ్వ ర్యంలో నిర్వహించే సభలకు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు, ఇతర రాష్ర్టాల సీఎంలు హాజరవుతున్నా జనాదరణ కరువై తేలిపోతున్నాయి.
వనపర్తి, (నమస్తే తెలంగాణ) 27 నవంబర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జి ల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ప్రచారంలో ఇతర పార్టీలకు ధీటుగా ముందుకు సాగింది. పకడ్బందీ ప్రణాళికతో అసెంబ్లీ వారీగా ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో నిర్వహించిన సీఎం సభలను విజయవంతం చేసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులకు నూతనోత్సాహాన్నిచ్చిం ది. ఈనెల 30వ తేదీన గురువారం అ సెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నేటి చివరి రోజును ప్రధాన పార్టీలన్నీ ప్రాధాన్యతగా తీసుకుంటున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. ఇతర పార్టీలకంటే ముందుగా బీఆర్ఎస్ అభ్యర్తులను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ప్రచారాలు కూడా అదే స్థాయిలో ముం దు వరుసలోనే నిర్వహించారు. చివరి దశలో ప్రచారాలకు ఆయా పార్టీల నేతలంతా హెలిక్యాప్టర్ల ద్వారా ఉరుకులు.. పరుగులు పెడుతున్నారు. ముందు నుంచి అన్ని నియోజక వర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు పెడతానని ప్రకటించిన సీఎం కేసీఆర్ అనుకున్నట్లుగా సభలను విజయవంతంగా నిర్వహించారు. అనుకున్న దాని కంటే ఎక్కువగా సభలను చేపట్టారు. ఇక కేవలం ఒక రోజు మాత్రమే ప్రచారాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి నిమిషం కూడా రాజకీయ పార్టీలకు ప్రాధాన్యతగా మారింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అ సెంబ్లీ స్థానాలపై ఆయా పార్టీల అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధా నంగా బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టితో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులను చూపెట్టి 14 సీట్లలోనూ పాగా వేయాలన్న లక్ష్యంతో గులాబీ దళం పట్టుదలతో ఉన్నది. ముందు నుంచి పక్కా ప్రణాళికతో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ అభ్యర్థులు అంతే ప్రాధాన్యతతో పల్లెల్లో లీనమయ్యారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉ మ్మడి జిల్లాలోని అన్ని స్థానాలకు ప్రచారంలో ప్రాధాన్యతనిచ్చారు. అలాగే బీజేపీ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్షా, మరో ఇద్దరు మం త్రులు నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కర్నాటక సీఎం సిద్ధిరామయ్య తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయి. మహబూబ్నగర్తోపాటు జ డ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర, కల్వకుర్తి, షాద్నగర్, నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, వనపర్తి, మక్త ల్, గద్వాల, అలంపూర్, మక్తల్ నియోజకవర్గాల పరిధిలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలను నిర్వహించారు. ఈ సభలన్నిటినీ బీఆర్ఎస్ శ్రేణులు పకడ్బందీగా ఏర్పాటు చేసి, ప్రతి కార్యక్రమాన్ని కూడా అనుకున్నదానికంటే ఎక్కువగా సక్సెస్ చేశారు. ప్రతి సభలోనూ ఆయా ప్రాంతాల వారీగా చేపట్టిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ వివరించడం, ఇంకా సంక్షేమ పథకాల అమలును సైతం కూలంకశంగా విడమరచడం ద్వారా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధానంగా 24గంటల కరెంటు, రైతుబంధు, పింఛన్లు, సాగునీరు తదితర పథకాల అమలు గురించి సీఎం చెప్పినప్పుడు సభికుల నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. ప్రజలకు సూటిగా అర్థమయ్యేలా సీఎం కేసీఆర్ ప్రసంగాలు ప్రజా ఆశీర్వాద సభల ద్వారా ఆసక్తిని రేకెత్తించాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అగ్రనేతల ప్రసంగాలన్నీ ఇతర భాషల్లో ఉండడం, వాటిని ఇతరులు అనువాదించడం ద్వారా అం తగా ఓటర్లు ఆసక్తిని చూపించలేదు. ఇదిలా ఉండగా, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఉమ్మడి జిల్లాలో పలు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలన్నీ అంతంత మాత్రంగానే కొనసాగాయి. చాలాచోట్ల ఖాళీ కుర్చీలతో సభా ప్రాంగణాలు కనిపించడం ద్వారా ప్రచారానికి వచ్చిన నేతలు సైతం గందరగోళానికి గురయ్యారు. అనేక చోట్ల అభ్యర్థుల మార్పు చేయడంవంటి చర్యలతో కాంగ్రెస్ ఉత్సాహం తగ్గిందన్న అభిప్రాయం ఉన్నది. టికెట్లు తెచ్చుకున్న అభ్యర్థులు సమన్వయం చేసుకోవడంలోనూ నామమాత్రంగా వ్యవహరించడంతో ప్రచారాలన్నీ ఎడమొఖం, పెడమొఖం అన్న చందానా కొనసాగాయి. ఇక బీజేపీలో కొందరు అగ్రనేతలను ప్రచారాలకు తెచ్చినప్పటికీ ప్రజలు ఆ పార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదరణ అంతంతే అన్న అభిప్రాయం వెలువడుతోంది.