ధరూర్, అక్టోబర్ 28 : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు సాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక తో ముందుకు సాగుతున్నది. ఈక్రమంలో ప్రా జెక్ట్ల నిర్మాణంతోపాటు చెరువులను పునరుద్ధరించి, కుంటల్లోని కంప చెట్లను తొలగింపజేసింది. ప్యాకేజీ కెనాల్స్, పిల్ల కాల్వలను విస్తరిం చి ప్రతి గుంటకూ సాగునీరు సరాఫరా చేసేలా ఏర్పాట్లు చేసింది. 24 గంటల ఉచిత కరెంట్ సాగును సంబురంగా చేసేందుకు తోడ్పాటునిచ్చింది. సాగునీరు సమృద్ధిగా లభించడంతో రైతులు వరి సాగుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పత్తి తర్వాత వరి పంటను మాత్రమే సాగు చేయడం ప్రారంభించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆరుతడి పంటల సాగుపై రైతులకు ఆసక్తి కలిగించడానికి అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఫలితంగా నేడు అన్నదాతలు ఆరుతడి వైపు ఆసక్తి చూపుతున్నారు. ఆముదం, మిరప, అలసందలు వంటి వాణిజ్య పంటలతోపాటు వేరుశనగ, బెండకాయ, కందు లు, బీరకాయ, చిక్కుడు వంటి ఆరుతడి, ఆహార పంటలు కూడా సాగుచేస్తూ నీటి పొదుపులో భాగస్వాములవుతున్నారు. అలాగే ప్రస్తు తం ఆముదం, మిర్చి, అలసందలు, వేరుశనగ పంటల ఉత్పత్తుల ధరలు కూడా మార్కెట్లో పెరుగుతుండడంతో రైతు లు ఈ పంటల సాగుకు ఆసక్తి చూపుతున్నా రు. ఆముదం క్వింటాకు రూ.7 వేలు, మిర్చి రూ.30వేల నుంచి గరిష్ఠంగా 50 వేల వరకు పలుకుతుంది. అతి తక్కువ పెట్టుబడితో సాగు చేసే అలసందలు క్విం టాకు రూ.6 వేల నుం చి రూ.8వేల వరకు పలుకుతున్నాయి. ఆము దం సాగుతో ఎకరాకు రూ.70వేల వర కు ఆదాయం, మిరపపై రూ.లక్షన్నర వరకు, అలసందలపై రూ.40 వేల వరకు లాభం వస్తుండడంతో అన్నదాత ఆరుతడి వై పు ఆసక్తి కనబర్చుతున్నారు. అలాగే ఆ హార పంటలైన బెండకాయ, బీరకాయ, చిక్కుడు వంటి కూరగాయల రేట్లు రూ.50నుంచి రూ.60 వరకు పలుకుతున్నాయి. కందులు క్వింటాకు రూ.12వేల పైనే పలుకుతున్నాయి.ఇటువంటి మంచి మార్కెటు పరిస్థితులు ఆరుతడి పంటలపై రైతుల ఆసక్తి చూపేలా చేస్తున్నాయి.