తెలంగాణ దశాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యుత్ విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులను సన్మానించారు. వనపర్తి, మహబూబ్నగర్లో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ హాజరై వారిని ఉత్సాహపరిచారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, జూన్ 5
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం విద్యుత్ ప్రగతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు విద్యుత్ ఉద్యోగులతో సమావేశమై ఉత్తమ సేవలందించిన వారిని సన్మానించారు. జడ్చర్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విద్యుత్ ఉద్యోగులతో కలిసి స్టెప్పులేసి సందడి చేశారు.