నారాయణపేట రూరల్, జనవరి 28 : జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తపస్ జిల్లా అధ్యక్షుడు శేర్ కృష్ణారెడ్డి తెలిపారు. టెస్ట్కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం జిల్లా కేంద్రంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా శేర్కృష్ణారెడ్డి మా ట్లాడుతూ 22ఏండ్ల కిందట డివిజనల్ స్థాయిలో పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన టె స్ట్ నేడు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టెస్ట్ దో హదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింహ, నారాయణరెడ్డి, భాస్కర్రెడ్డి, కృ పాకర్రెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్, బస్వరాజ్ ఉన్నారు.