అచ్చంపేట, డిసెంబర్ 14 : ఉ మ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల గిరిజన సం క్షేమ శాఖ ఆశ్రమ పా ఠశాలలు, వసతి గృహా ల విద్యార్థుల అండర్-14, అండర్-17 జోనల్ స్థాయి క్రీడా పోటీలను అ చ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో గు రువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా నాగర్కర్నూల్ కలెక్టర్ పి.ఉదయ్కుమార్ హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడా పతాకావిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి వచ్చిన 1,657 మంది గురుకుల క్రీడాకారులు అధికారులకు, మార్చ్ఫాస్ట్ చేసి అధికారులతో గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ఆడిన వారే భవిష్యత్లో రాణిస్తారని అన్నారు. అచ్చంపేట మూడోసారి జోనల్ క్రీడలకు అతిథ్యమిస్తున్నదని, అందుకు కృషిచేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులను ఆయన అభినందించారు. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని చెప్పారు.
ఏడు జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికలు ఆత్మవిశ్వాసంతో ఆడి విజయం సాధించాలన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఒకప్పుడు తాను కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థినేనని తెలిపారు. గ్రామీణ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు జోనల్ స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రింగ్బాల్, అథ్లెటిక్, ఇండోర్, భాస్కెట్బాల్ పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రతి విద్యార్థి జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అండర్-14, 17 విభాగంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, లాంగ్జంప్, హైజంప్, హ్యాండ్బాల్తోపాటు అథ్లెటిక్ పోటీలు మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమశాఖ అధికారి కమలాకర్రెడ్డి తెలిపారు. జోనల్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు భద్రాచలంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, ఆర్డీవో గోపిరామ్, నల్లగొండ, సూర్యాపేట, డీటీడబ్ల్యూవోలు రాజ్కుమార్, శంకర్, ఏటీడబ్ల్యూవో లక్ష్మారెడ్డి, బాలకృష్ణ, ఎంఈవో రామారావు, సీఐ అనుదీప్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, ఏటీడబ్ల్యూవోలు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.