హన్వాడ, ఫిబ్రవరి 1 : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీ ర్చిదిద్ది పునర్వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా క్టర్ వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.52.97 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రా థమిక పాఠశాలను బుధవారం మంత్రి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో సర్కార్ బడులకు మహర్దశ పట్టిందన్నారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు, వసతులు క ల్పించాలని నిర్ణయించారని తెలిపారు. ఇందులో భా గంగా బడులను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. నేడు కార్పొరేట్ స్థాయిలో స్కూళ్లు విద్యాబోధన అందిస్తున్నాయన్నారు.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాని కి సీఎం కేసీఆర్ రూ.7,289 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. నీటిసౌకర్యం, టాయిలెట్లు, విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నిచర్ సమకూర్చడం, పాఠశాలలు నవీకరించడం, కిచెన్ షెడ్ల ఏర్పాటు, శిథిలమైన గదుల స్థా నంలో కొత్తవి నిర్మించడంతో పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. హన్వాడ మండలానికి అదనంగా బీసీ బాలికల గురుకులాన్ని కేవలం 15 రోజుల్లో మంజూరు చేయించామన్నారు. పోటీ పరీక్షల ద్వారా కష్టపడి ఉద్యోగాలు సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయు ల మార్గదర్శకత్వంలో ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ బడుల్లోనే అద్భుతమైన విద్య అందుతుదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, డీఈవో యాదయ్య, ఆర్డీవో అనీల్కుమార్, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయలక్ష్మి, సింగిల్విండో చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజుయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సర్పంచ్ రేవతి, విండో వైస్చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఎంపీడీవో ధనుంజయ, తాసిల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
గండీడ్/మహ్మదాబాద్, ఫిబ్రవరి 1 : ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయడంలో భాగంగా ‘మన ఊరు-మన బడి’ కింద సర్కార్ పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. బుధవారం మహ్మదాబాద్ మండలం చిన్నాయిపల్లి, గండీడ్ మండలం జక్లపల్లి, గండీడ్ గ్రామాల్లో ఆధునీకరించిన పాఠశాలలను ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించినట్లు తెలిపారు. బడుల రూపురేఖలు మారి కొత్తదనంతో మెరిసిపోతున్నాయన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆ కాంక్షించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రె డ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, తాసిల్దార్ ఆంజనేయులు, సర్పంచులు మధులత, కాంతమ్మ, చంద్రకళ, ఎంపీవో శంకర్నాయక్, నాయకులు గోపాల్రెడ్డి, తిర్మల్రెడ్డి, రాంచంద్రారెడ్డి, హెచ్ఎంలు, పంచాయతీరాజ్ ఏఈలు, ఉపాధ్యాయు లు తదితరులు పాల్గొన్నారు.
-పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
ఎర్రవల్లి చౌరస్తా, ఫిబ్రవరి 1 : కార్పొరేట్కు దీటుగా సర్కార్ బడులను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే అబ్ర హం, జెడ్పీ చైర్పర్సన్ సరిత తెలిపారు. మండలంలోని ఆర్.గార్లపాడు గ్రామంలో మన ఊరు-మనబడిలో భాగంగా నూతనంగా నిర్మించిన యూపీఎస్ పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతు లు కల్పించామని, ఇ ది చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 160 పాఠశాలను మొదటి విడుతలో ఎంపిక చేసి టాయిలెట్లు, వంటగదులు, మరమ్మతులు చేపట్టామన్నారు. గార్లపాడు పాఠశాలలో రూ.7.66 లక్షలతో సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణలో చె త్తాచెదారం ఉండకుండా, ఇతరులు ప్రవేశించకుండా గ్రా మస్తులు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో సిరాజుద్దీన్, సర్పంచ్ పద్మ, హెచ్ఎం ఖరేంద్రనా థ్, శివకుమార్, తాసిల్దార్ సుబ్రహ్మణ్యం, డీఈ సలాం, ఎంఈవో రాజు, ఎంపీటీసీ మల్లేశ్, హుస్సే న్, జగదీశ్వర్రెడ్డి, ఆ ర్ఐ ప్రశాంత్ గౌడ్ పాల్గొన్నారు.
వెల్దండ, ఫిబ్రవరి 1 : ‘మన ఊరు-మన బడి’ ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి తెలిపారు. మండలకేంద్రంలోని ఎ మ్మార్సీ ప్రాథమిక పాఠశాలలో రూ.7 లక్షలతో చేపట్టిన వాటర్ ట్యాంక్, ప్రహరీ, మరుగుదొడ్లు తదితర వసతులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవ డం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, తాసిల్దార్ చంద్రశేఖ ర్, ఎంఈవో శంకర్నాయక్, వైస్ఎంపీపీ శాంతి, సర్పంచ్ భూపతిరెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, హెచ్ఎంలు జైపాల్రెడ్డి, అంజయ్య, తిరుపతిబాయి, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాదగిరి, ఉప సర్పంచులు అలీ, నర్సింహ, సురేందర్రెడ్డి, హరికిషన్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ, ఫిబ్రవరి 1 : ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీ ర్చిదిద్ది పునర్వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి డా క్టర్ వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండల కేంద్రంలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.52.97 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రా థమిక పాఠశాలను బుధవారం మంత్రి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో సర్కార్ బడులకు మహర్దశ పట్టిందన్నారు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు, వసతులు క ల్పించాలని నిర్ణయించారని తెలిపారు. ఇందులో భా గంగా బడులను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. నేడు కార్పొరేట్ స్థాయిలో స్కూళ్లు విద్యాబోధన అందిస్తున్నాయన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాని కి సీఎం కేసీఆర్ రూ.7,289 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. నీటిసౌకర్యం, టాయిలెట్లు, విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి సరిపడా ఫర్నిచర్ సమకూర్చడం, పాఠశాలలు నవీకరించడం, కిచెన్ షెడ్ల ఏర్పాటు, శిథిలమైన గదుల స్థా నంలో కొత్తవి నిర్మించడంతో పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. హన్వాడ మండలానికి అదనంగా బీసీ బాలికల గురుకులాన్ని కేవలం 15 రోజుల్లో మంజూరు చేయించామన్నారు. పోటీ పరీక్షల ద్వారా కష్టపడి ఉద్యోగాలు సాధించిన ప్రభుత్వ ఉపాధ్యాయు ల మార్గదర్శకత్వంలో ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ బడుల్లోనే అద్భుతమైన విద్య అందుతుదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, డీఈవో యాదయ్య, ఆర్డీవో అనీల్కుమార్, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయలక్ష్మి, సింగిల్విండో చైర్మన్ వెంకటయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజుయాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, సర్పంచ్ రేవతి, విండో వైస్చైర్మన్ కృష్ణయ్యగౌడ్, ఎంపీడీవో ధనుంజయ, తాసిల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 1 : ప్రభు త్వ బడుల్లోనే మెరుగైన విద్య అందుతుందని ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. అడ్డాకుల మండలంలోని పొన్నకల్ ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద రూ.1.10 కోట్లతో చేపట్టిన నూతన తరగతి గదులు, డిజిటల్ తరగతి గదిని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విదేశాల్లో కంటే మన ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్యనందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ఎక్కువ ఫీజులు కట్టే పాఠశాలల్లో చదువు మంచిగా చెబుతారన్న అపోహను వీడి విద్యార్థులను ప్రభుత్వ బడులకు పంపాలని తల్లిదండ్రులను కోరారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు.. ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉండాలన్నారు. పాఠశాల నిర్మాణానికి గతంలో రెండెకరాలను దానం చేసిన జాజాల కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే సన్మానించారు. పదో తరగతి విద్యార్థుల కోసం ఆల రఘుపతిరెడ్డి సేవా సంస్థ నుంచి త యారు చేసిన గైడ్స్ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. విద్యార్థిని అక్షర చేసిన రాణిరుద్రమదేవి పాత్ర ఆకట్టుకోవడంతో ఎమ్మెల్యే అభినందించారు. కా ర్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షు డు ప్రణీల్ చందర్, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్రావు, జెడ్పీటీసీ రాజశేఖర్రె డ్డి, సర్పంచ్ కల్పన, ఈఈ వెంటయ్య, డీఈ కృష్ణ, తాసిల్దార్ కిషన్, నాయబ్ తాసిల్దార్ శ్రీనివాసు లు, ఎంపీడీవో మంజుల, ఎంపీవో విజయకుమా రి, ఎంఈవో నాగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ జితేందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జయన్నగౌడ్, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రంగన్నగౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, నాయకులు మహమూద్, రమేశ్గౌడ్, సత్యనారాయణరెడ్డి, రాజేశ్వర్రెడ్డి, కృష్ణయ్య, మన్యంకొండ తదితరులు పాల్గొన్నారు.
-దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి