వనపర్తి, డిసెంబర్ 25 : వనపర్తి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ సింగిరెడ్డి తారకమ్మ స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను వనపర్తిలో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు టోర్నీ కొనసాగుతుందని చెప్పారు.
ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్ను మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ పుట్టపాకుల మహేశ్, మార్కెట్ డైరెక్టర్ సూర్యవంశం గిరి, హేమంత్ ముదిరాజ్, జోహెబ్ తదితరులు పాల్గొన్నారు.