అమ్రాబాద్, అక్టోబర్ 26 : బీఆర్ఎస్పై అభిమానంతో గురువారం అచ్చంపేట పట్టణంలో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభకు యువకులు తమ అభిమానం వెల్లువిరిసేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల రాజు ఫొటోలను పట్టబొట్టు రూపంలో గుండెలపై ముద్రించుకున్నారు. సీఎం కేసీఆర్, మంతి కేటీఆర్, గువ్వల బాలరాజు ఫొటోలను ముద్రించుకున్నారు. యువకుడు అ చ్చంపేటలో మూడో వార్డుకు చెందిన విజయ్ కా గా మరో యువకుడు అదేగ్రామానికి చెందిన పర్వతాలు. వీరిద్దరు తమ నేతల ఫొటోలను ముద్రించుకోవడం తో అందరూ వారిని సభా స్థలిలో మె చ్చుకున్నారు. మరోసారి సీఎంగా కేసీఆర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కావడం ఖాయమని నినాదాలు చేశారు.
సీఎం కేసీఆర్ రైతులకు అడగకుండానే పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నాడు. గతంలో సాగు పె ట్టుబడి కోసం సావుకారి వద్దకు వెళ్లి అప్పులు చేసి ఇబ్బందులు పడేటోళ్లం. కానీ తెలంగాణ ఏర్పాడ్డాక రైతుల కష్టాలు గుర్తించిన సీఎం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు అందజేస్తున్నాడు. మూడో సారి కూడా కేసీఆరే సీఎం అయ్యి ఏడాదికి ఎకరాకు రూ.16వేలు అందిస్తాడని మాకు నమ్మకం ఉంది.
అడగకుండానే దళితుల జీవి తా ల్లో దళిత బంధు పథకం ద్వారా సీఎం కేసీఆర్ వెలుగులు నింపా రు. గతంలో ఏపార్టీలు దళి తుల ను పట్టించుకున్న పాపన పోలే దు. దళిత బంధు ద్వారా ఒక్కొ కుటుంబానికి రూ.10లక్షలు అందజేసి వారికి ఆర్థిక భరోసా కల్పించారు. అలాంటి నాయకుడిని చూడటానికే అచ్చంనేటలో నిర్వహించిన సభకు వచ్చాను.
కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను కేవలం నాలుగు వందలకే అందిస్తానని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆనందంగా ఉంది. సబ్బండ వర్గాల బాగు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ సారి కారు గుర్తుకు ఓట్లేసి గువ్వల బాలరాజును గెలిపిస్తాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాల వారు బాగుపడుతారు.
సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. దివ్యాం గు లకు గతంలో అరకొర పింఛ న్ వచ్చేది. దీంతో బతుకు బండి నడపాలంటే చాలా ఇబ్బందులు పడేటోళ్లం. తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాడ్డాక దివ్యాంగులకు రూ.2వేల పింఛన్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంది. ఈ సారి బీఆర్ఎస్ గెలిస్తే పింఛన్ రూ.5 వేలు చేస్తామంటున్నారు. దీంతో మేము ఎవరిపై ఆధారపడి జీవించొచ్చు.
నాకు ఇద్దరు కొడుకులు.. వా రికి పెళ్లిండ్లు చేశాక ఇంటి నుం చి బయటికి వెళ్లిపోయారు. భార్య కూడా చనిపోయింది. తెలం గాణ ప్రభుత్వం వచ్చాక ఆసరా పింఛన్తో జీవనం కొనసాగిస్తు న్నాను. నాలాంటి పేదవారికి సీఎం కేసీ ఆర్ పెద్ద కొడుకులాంటి వాడు. వృద్ధుల పాలిట కనిపించే దేవుడు కేసీఆర్. అందుకోసమే ఆయనిని చూడ టానికే మూడు చక్రాల రిక్షాతో సభకు వచ్చాను.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అ మలవుతున్నాయి. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలకులు మమ్మల్ని ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు. ఇన్ని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి గిరిజనులంతా అండగా నిలుస్తాం. సీఎంను చూడటానికి వనపర్తికి బైక్పై వచ్చాను
గతంలో నేను ఆర్మీ ఉద్యోగం చేస్తూ జమ్మూకాశ్మీర్లో ఉండేవాడిని. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది సీఎంలను చూశాను. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చావు అంచుల దాకా వెళ్లి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ అలుపెరగకుండా నిరంతరం పోరాటం చేస్తున్నారు. అలాంటి పోరాటయోధుడిని చూడటానికి సభకు వచ్చాను.
దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరిగిం ది. రాష్ట్రంలో కాకుండా వనపర్తి నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది మంత్రి నిరంజన్ రెడ్డి. గతంలో సాగునీరు లేక పొలాలు బీడు బారిపోయేవి.. కానీ ప్రస్తుతం పుష్కలంగా నీళ్లు ఉండడం తో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ఇవే కాకుండా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇస్తూ మమ్మల్ని అదుకుంటున్నారు.