పరీక్షలకు 8,099 మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాలు
అరగంట ముందుగా సెంటర్లకు చేరుకోవాలి
ఎలాంటి ఉపకరణాలు తీసుకురావొద్దు
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి
నారాయణపేట, మే 22 : నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూ ర్తి చేశారు. జిల్లాలో మొత్తం 8,099 మంది విద్యార్థులు ప రీక్షలు రాయనున్నారు. అందులో 8,067 మంది రెగ్యుల ర్, 32 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందుకోసం జిల్లాలో మొత్తం 38 పరీక్షా కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 3,844 మంది బా లురు, 4,223 మంది బాలికలు ఉన్నారు. 32 మంది ప్రైవే ట్ విద్యార్థుల్లో 15 మంది బాలురు, 17 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు 415 మంది ఉపాధ్యాయులను ఇ న్విజిలేటర్లుగా, 38 మంది చీ ఫ్ సూపరింటెండెంట్లను 38 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ఎంఈవో, డిప్యూటీ తాసిల్దార్, ఏఎస్సైలతో కూడిన ఫ్లయింగ్ స్వాడ్ బృందం ఏర్పాటు చే శారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీఎస్, డీవోల కార్యాలయం లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అదే విధం గా పరీ క్ష జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. పరీక్షా కేంద్రంలో పని చేసే సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని, పరీక్ష జరిగే సమయంలో లోపలికి, బ యటకు రావడానికి వెళ్లడానికి వీలు లే దని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా ప్రతి సెంటర్లో డీఎంహెచ్వో సహకారంతో ఏఎన్ఎం, ఆశవర్కర్లు ప్రథమ చికిత్స కిట్లతోపాటు అత్యవసర సమయంలో వినియోగించేందుకు మందులను అందుబాటులో ఉంచనున్నారు. కేంద్రాల వద్ద మంచినీటి వసతి కల్పించాలని జిల్లాలోని కోస్గి, మక్తల్, నారాయణపేట మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని కేంద్రాల్లో పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.
విద్యార్థులు నిబంధనలు పాటించాలి
పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఉదయం 9:30 నుంచి 12:45 గంటల వరకు పరీక్షలు కొనసాగనుండగా.. ది వ్యాంగులకు అదనంగా 30 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. పరీక్షకు అరగంట ముందు కేంద్రానికి చేరుకోవాల ని, కేంద్రానికి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకురాకూడదని తెలియజేశారు. ప్రశ్నాపత్రం ప్రతి పేపర్పై హాల్ టికెట్ నెం బర్ రాయాలని, అదే సమయంలో జవాబు పత్రంలో మా త్రం ఎలాంటి హాల్ టికెట్ నెంబర్ కానీ పేరు గానీ రాయకూడదన్నారు. ప్రతి విద్యార్థి బస్పాస్ రెన్యూవల్ చేసుకోవాలని, హాల్ టికెట్తో బస్సు ప్రయాణం చెల్లదని తప్పనిసరిగా బస్పాస్ ఉండాలన్నారు. ఆదివారం సెంటర్లను వి ద్యాశాఖాధికారులు పరిశీలించారు.