నల్లమల అటవీ అందాలను తిలకిస్తే విదేశాల్లో చూసినట్లు ఉన్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఏటీఆర్ వెబ్సైట్, సఫారీ వాహనాలు, కాటేజీలను విప్ గువ్వల, ఎంపీ రాములు, అటవీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులుల సంఖ్య పెరిగిందని, దీంతో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉన్నదన్నారు.
– నాగర్కర్నూల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ)/అమ్రాబాద్
నాగర్కర్నూల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ)/అమ్రాబాద్ : ‘సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.. ఇంతకు ముందు పులులను చూడాలంటే విదేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ నేడు కవ్వాల్, అమ్రాబాద్ అడవుల్లోనే ప్రత్యక్షం గా చూసే అవకాశం ఏర్పడింది’.. అని అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజ ర్వ్ ఫారెస్ట్లో నూతనంగా రూపొందించిన వెబ్సైట్, రూ.1.20 కోట్లతో సమకూర్చిన 8 సఫారీ వాహనాలను, రూ.90 లక్షలతో నిర్మించిన 6 కా టేజీలను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, అటవీ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో మాట్లాడుతూ నల్లమలలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
సీ ఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అడవులను కాపాడుతూ పర్యావరణహిత పర్యాటక అభివృద్ధిలో తెలంగాణ ముందుకు అడుగులు వేస్తున్నదన్నారు. నల్లమల కృష్ణానది పరీవాహక ప్రాంతం కావడం, గడ్డి క్షేత్రాలు, శాఖాహార జంతువులు అధికంగా ఉండటంతో పులుల సంఖ్య పెరుగుతూ వస్తుందని చెప్పారు. అలాగే 106 ఊట చెరువులు, 1,149 సాసర్ పిట్లు, 99 చెక్ డ్యాంలు, 29 సోలార్ బోర్లతో జంతువులకు నీళ్లు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకున్నామన్నారు.
గతంలో నీళ్ల కో సం చెరువుల వద్దకు జంతువులు వచ్చేవని, వాటి కోసం వేటగాళ్లు వచ్చేవారని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో జంతువులకు అడవుల్లోనే తాగునీళ్లు లభిస్తున్నాయన్నారు. దీంతో 2018లో కేవలం 18 పెధ్ద పులులుంటే నేడు 26కు సంఖ్య చేరాయన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.4,900కే సఫారీ టూర్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తాను ఉదయం అభయారణ్యంలో పర్యటించానని, విదేశాలకు వెళ్లిన అనుభూతి కలిగిందని మంత్రి పేర్కొన్నారు. అట వీ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమంతో పచ్చదనం మరింత పెరిగిందన్నారు. గజ్వేల్లో వంద ల ఎకరాల్లో పెరిగిన మొక్కలు అడవులుగా మారాయన్నారు. స్మగ్లర్లపై పీడీ కేసులు నమోదు చేశామని తెలిపారు. త్వరలో పోడు భూములపై నిర్ణ యం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఆక్సిజన్ లభించక ఇబ్బందులు ఎదురయ్యాయని, అడవులు పెంచితే స్వచ్ఛమైన గాలి లభిస్తుందని స్పష్టం చేశారు. స్మగ్లర్ల సమాచారం ఎవరైనా తెలియజేస్తే బహుమతులు అందిస్తామ ని వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ మధ్యలోని ఈ ప్రాంతం టూరిజంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఉమామహేశ్వరం, శ్రీశై లం, సలేశ్వరం, మద్దిమడుగు వంటి పుణ్యక్షేత్రా లు ఉండటంతో ఎకో టూరిజానికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే టూరిజం అభివృద్ధి చేపట్టేలా కార్యాచరణ ఉంటుందన్నారు.
ఉమామహేశ్వరం నుంచి కొత్తగా సఫారీ టూర్ ఏర్పాటు చే యనున్నట్లు తెలిపారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై వచ్చే ప్రచారం నమ్మొద్దని సూచించారు. నల్లమలలోని చెంచులు ఇష్టంతో ముందుకొస్తే వారికి స్పష్టమైన పరిహారం ఇచ్చి బయటి ప్రాంతాల్లోకి తరలించడం జరుగుతుందన్నారు. అలాగే చెంచులకు జూట్ బ్యాగులు, తేనె సేకరణతో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తెలంగాణలో అద్భుత, ప్రకృ తి రమణీయ క్షేత్రాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. అటవీ పర్యవేక్షణ నేరుగా చూసేందుకు ఏర్పాటు చేసిన 10 లైవ్ నిఘా కెమెరాలు పని చేస్తాయన్నారు. అడవులను ప్లాస్టిక్ ఫ్రీ జోన్లుగా ప్రకటించామన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
కల్వకుర్తి, జనవరి 20 : పర్యావరణ పరిరక్షణకు యువత నడుం బిగించాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. కల్వకుర్తి మున్సిపాలిటీ కొట్ర పరిధిలో ఎస్వీ ప్రొడక్ట్స్ కుటీర పరిశ్రమ నిర్వాహకులు తయారు చేసిన ఆకుల ప్లేట్లను ఆవిష్కరించారు. ముందుగా మంత్రికి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఘనంగా స్వాగతం పలికారు.