నాగర్కర్నూల్, డిసెంబర్ 11 : హైదరాబాద్లో నాగర్కర్నూల్కు జిల్లాకేంద్రానికి చెందిన మంత్రగాడు హత్యా ఘటనలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రాంతంలో ఇటీవల ఓ హత్య కేసులో పోలీసులు విచారణ చేపడుతుండగా నాగర్కర్నూల్కు చెందిన మంత్రగాడిగా ముద్ర వేసుకున్న ఓ వ్యక్తి ఉ న్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అకడి పోలీసులు విచారణ నిమిత్తం నాగర్కర్నూల్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. తాంత్రికుడిగా పేరొందిన సత్యంయాదవ్ అలియాస్ సత్యనారాయణస్వామి అమాయకులైన మహిళలు, మంత్రాలను నమ్మే వ్యక్తులను మోసం చేయడంలో దిట్ట. ఎలాంటి వ్యక్తులైన నమ్మించి మోసం చేయ డం, వారు ఆమోసాన్ని పసిగట్టేలోపే ఎంతటికైనా తెగించేందుకు వెనుకాడడు అని తెలుస్తోంది. నాగర్కర్నూల్ జిల్లాతోపాటు హైదరాబాద్, వనపర్తి, కర్ణాటక, రాయిచూర్ వంటి ప్రాంతాల్లో మోసాలు చేస్తూ ప్లాట్లు, భూము లు తన పేరున చేసుకున్నాడు. ఇందుకోసం ముందుగా అమాయకులైన మహిళలు, వితంతువులను పరిచయం చేసుకొని వారిని వశీకరణ చేసుకొని వారి ఆస్తులను మొత్తం లాగేకుంటాడు. వాళ్లు ప సిగడుతున్నారన్న విషయాన్ని గు ర్తిస్తే వారిని దూరం పెట్టడం, లే దంటే హత్యలు చేయడం వంటి వాటికి వెనుకాడని తెలుస్తోంది. మూడేళ్ల కిందట వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రా మంలో గుప్తనిధుల తవ్వకాల కోసం ఒకే కుటుంబానికి చెంది న ఓ చిన్నారితోపాటు ముగ్గురు వ్యక్తులను హత్య చేసిన ఘటనలో ఈ మంత్రగాడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడని అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కుటుంబ సభ్యులు అతడిపై అనుమానం ఉన్నట్లు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేక పో యింది. ఒకే కుటుంబానికి చెందిన వారు ఎలా చనిపోయారన్న ఆనవాళ్లను పోలీసులు గుర్తించలేకపోయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నాగర్కర్నూల్ మండలం గన్యాగుల గ్రామంలో ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాట లు చెప్పి యువకుడి తండ్రితో ఒక ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తీరా ఉద్యోగాన్ని ఇప్పించలేకపోయాడు. ఈ విషయం లో సదరు యువకుడి తండ్రి తిరిగి తన ప్లాటును తన పేరున చేయాలని అడిగినందుకు అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈవిషయమై కూడా పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చే సినా హత్యకు గల కారణాలు అంతుచిక్కలేదని తెలుస్తోంది. ఇది లా ఉండగా ఈ ఏడాది ఆగస్టు మూడోవారంలో కర్ణాటక రాష్ట్రంలోని మాన్వి ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వితంతువు మహిళా మృతదేహం లభ్యమైంది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక పోలీసులు విచారణ చేపట్టగా నాగర్కర్నూల్కు చెందిన ఓ మంత్రగాడే హత్య చేశాడని వెళ్లడైనట్లు కర్ణాటక పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హత్యకు గురైన మహిళ రాయిచూర్ ప్రాంతంలోని గౌలి ప్రాంతానికి చెందిన తిరుపతమ్మగా కర్ణాటక పోలీసులు గుర్తించారు. ఇలా అమా యకులనలు మోసం చేస్తూ భూములు, ప్లాట్లు తన పేరున చేసుకొని, తన మాట వినని వారిని హత్యచేస్తూ వస్తున్నట్లు ఆరో పణలు వస్తున్నారు. ఇతగాడి బాగోతం రెండేళ్ల కిందటే బయటపడినప్పటికీ చర్యలు మాత్రం అంతంగానే ఉంటున్నాయని, దర్జాగా బయట తిరుగుతున్నాడని జిల్లా కేంద్రానికి చెందిన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.