జడ్చర్ల టౌన్, జనవరి 3 : సమాజంలో అసమానతలపై , మహిళల హక్కుల కోసం సావిత్రీబాయి ఫూలే విశేష కృషి చేశారని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం జడ్చర్లలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సావిత్రీబాయి ఫూలే విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె సేవలను మహిళా లోకం స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు రఘురాంగౌడ్, ప్రశాంత్రెడ్డి, రమేశ్, మహేశ్, బీఆర్ఎస్ నాయకులు మురళి, జంగయ్య, ప్రీతమ్, రఘుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, మహెమూద్, బాలు, వీరేశ్, విజయేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలోని నసుర్లాబాద్ శివాలయంలో నిర్వహించిన దేవతామూర్తుల విగ్రహా ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో బుధవారం జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో శివలింగం, నందీశ్వర, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పూజలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్చందర్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రాజాపూర్, జనవరి 3 : సావిత్రీబాయి ఫూలే జయంతిని బుధవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రా మాల్లో పార్టీలకతీతంగా ఆమె చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యాదయ్య, గోవర్ధన్రెడ్డి, కృష్ణయ్య, రామకృష్ణగౌడ్, శంకర్, చంద్రయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, జనవరి 3: పేట మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి సావిత్రీబాయిఫూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి హెచ్ఎం, ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఊట్కూర్, జనవరి 3: మండలకేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సింగిల్విండో అధ్యక్షుడు ఎల్కోటి నారాయణరెడ్డి, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు శంకర్, హెచ్ఎం లక్ష్మారెడ్డి, సామాజిక కార్యకర్త నారాయణ పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, జనవరి 3: మహిళా లోకాన్ని ఏకం చేసేందుకు అలుపెరుగని పోరాటాలు చేసిన యోధురాలిగా సావిత్రీబాయి ఫూలే చరిత్రలో నిలిచిపోయారని జీహెచ్ఎం అనిల్గౌడ్ అన్నారు. బుధవారం మక్తల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మక్తల్ అంబేదర్ సంఘం ఆధ్వర్యంలో అంబేదర్ చౌరస్తా వద్ద ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మాగనూర్ జనవరి 3: మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, మందిపల్లి పాఠశాలల్లో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.
కృష్ణ, జనవరి 3: మండలంలోని గుడెబల్లూర్ పాఠశాలలో సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాలొన్నారు.
నవాబ్పేట, జనవరి 3 : మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయ ఆవరణలో బుధవారం ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు సావిత్రీబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్గౌడ్, సింగిల్విండో డైరెక్టర్ ప్రతాప్, మండల కోఆప్షన్ సభ్యు డు తాహేర్, సింగిల్విండో సీఈవో హన్మంతు, నాయకులు గిరియాదవ్, రవీందర్ పాల్గొన్నారు.
దేవరకద్ర, జనవరి 3 : సావిత్రీబాయి ఫూలే ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ మార్కెట్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు ఆంజనేయులు అన్నారు. బుధవారం సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా అంబేద్కర్నగర్ సంఘం ఆధ్వర్యంలో ఘ నంగా నివాళులర్పించారు. ఆమె చిత్రపటానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజు, చం ద్రశేఖర్, ప్రదీప్, చెన్నప్ప, చిన్ననర్సింహులు, వెంకటేశ్, వాసు, బాలు, కురుమన్న, హన్మంతు పాల్గొన్నారు.