ఊట్కూర్, డిసెంబర్ 10 : అన్నదాతలకు పంటలు పండించడం సాహసమైతే.. దానికి ముందు పశుపక్షాదులను తట్టుకుని నారు పెంచడం అంతకంటే పెద్ద సాహసం. ఊట్కూర్ మండల కేంద్రం నుంచి సంస్థాపూర్కు వెళ్లే రహదారి పక్కనే ఉన్న పొలంలో ఓ రైతు వరి నారు పెంచుతున్నాడు.
వరినారు పశువుల బారిన పడకుండ విభిన్నంగా ఆలోచించాడు. ఎటువంటి ఖర్చు చేయకుండా ఇంట్లో పాత చీరలను తెచ్చి వరి నారుకు రక్షణగా ఏర్పాటు చేశాడు. ఆ నారు పెరిగి పెద్దదయ్యింది. మరికొద్ది రోజుల్లో వరి నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ దృష్యాన్ని ‘నమస్తే తెలంగాణ’ క్లిక్ మనిపించింది.