మిడ్జిల్, డిసెంబర్ 16: రైతులను సంఘటితం చేసి వారికి పంటల సాగు, పండిన పంటకు మార్కెటింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి కేసీఆర్ ఆలోచనా విధానంతో ఏర్పాటైన ఈ వేదిక లు 2020-21లో అందు బాటులో వచ్చినా కరోనా కారణం గా నిధుల మంజూరులో కొంత జాప్యం జరిగింది. ప్రస్తు తం ఐదు నెలలవి మంజూరు చేయడంతో రైతు సమితి సభ్యు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మిడ్జిల్ మండలంలో ప్రతి ఐదు వేల హెక్టార్లకు ఒక క్లస్లర్ ఏర్పాటు చేసి మండల కేంద్రంతో పాటు రాణిపేట, కొత్తూర్, వస్పుల , దోనూరు గ్రామాల్లో రైతు వేదికలు నిర్మించారు. క్లస్టర్ ప్రకారం వేముల, కొత్తపల్లి రైతు వేదికలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. రైతు వేదికల నిర్మాణం కోసం కొన్ని గ్రామాల్లో దాతలు స్థలాలు ఇవ్వగా, కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు కేటాయిం చగా ఒక్కో రైతు వేదిక రూ.22 లక్షలతో పూర్తి చేశారు. వీటి నిర్వహణ కోసం నెలకు రూ.9 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. కరోనా కారణంగా నిధుల కేటాయింపులో కొంత జాప్యం జరిగింది. ప్రభుత్వం మొదటి సారి ఐదు నెల ల నిర్వహణ ఖర్చులకు గానూ ఒక్కో వేదికకు రూ. 45వేలు మంజూరయ్యాయి. దీంతో మండలంలోని ఐదు వేదికలకు మొత్తం రూ.2లక్షల 25వేలు మంజూరు కావడ ంతో రైతుబందు సమితుల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. వీటిని విద్యుత్ బిల్లులు, క్లీనింగ్ చార్జీలు, ఇతర అవసరాకు ఖర్చు చేయనునట్లు వారు తెలిపారు.
సత్ఫలితాలు…
రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన విధంగానే రైతు వేదికలు సత్ఫ లితాలిస్తున్నాయి. ప్రతి సీజన్లో రైతులకు వాతావరణ సూ చనలు, పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు అధునిక పద్దతులపై వ్యవసాయ శాఖ అధికారులు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపభుత్వం ఉద్యమంలా చేపట్టిన ఆయిల్పామ్ తోటల సాగుపై అవగా హన కల్పిస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ విస్తరణా ధికారులకు ఈ వేదికలే కార్యాలయాలుగా మారాయి. మం డల, డివిజన్ వ్యవసాయాధికారులు లేనిచోట వీటిని ప్రధాన కార్యాలయాలుగా కూడా వినియోగించుకుంటున్నారు.
విద్యుత్ బిల్లులు, క్లీనింగ్కు ప్రాధాన్యత
రైతు వేదికలు నిర్మించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా విడుదల చేసిన నిర్వహణ నిధులను వ్వవ సాయ విస్తరణ అధికారులకు అందజేస్తాం. వీటిని విద్యుత్ బిల్లులు, క్లీనింగ్ చార్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెబు తున్నాం. ఇతర ఖర్చులు కూడా చేసుకునే అవకాశం ఉం టుంది. మండలంలోని కొత్తపల్లి, వేముల గ్రామాల్లో రెండు రైతు వేదికలను మంజూరు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం త్వరలోనే అవి కూడ మంజూరవుతాయి.
– ఎవో సిద్ధార్థ