మహబూబ్నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె, పట్టణ ప్రగతి పథకాలు రాష్ట్ర స్వరూపాన్నే మార్చేస్తున్నాయి. గతం లో గ్రామాలు పారిశుధ్య నిర్వహణ లేక ము రికి కూపాలుగా ఉండేవి. పట్టణాల్లోనూ చా లా ప్రాంతాల్లో పారిశుధ్యంపై పట్టింపే ఉం డేది కాదు. ఈ పరిస్థితిని మార్చేందుకు సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారు. దీంతో పారిశు ధ్యం, మౌలిక వసతుల కల్పనకు అవకాశం ఏర్పడింది. డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా, సేంద్రియ ఎరువుల తయారీ, మొక్కలు నాటి వాటిని కాపాడటం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నా యి. మరోవైపు పట్టణాల్లో పారిశుధ్యం పెంపు చర్యలు తీసుకుంటూనే మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. ఈ నెల 20 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభమవుతున్న వేళ.. సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ముఖ్య అధికారులు హాజరుకానున్నారు. పల్లెప్రగతి ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మూడు గ్రామాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. వివిధ కేటగిరీల్లో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపును సాధించాయి. వెనకబడిన జిల్లాగా పేరున్న ఉమ్మడి పాలమూరులోని పల్లె లు ఇప్పుడు పల్లె ప్రగతి కారణంగా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకు నా లుగు విడుతల్లో పల్లెప్రగతి కార్యక్రమం జరగగా.. ఈ నెల 20 నుంచి ఐదో విడుత ప్రారంభం కానున్నది. ఈ మేరకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని మూడు పల్లెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లి గ్రామంలో సకల మౌలిక వసతులుండడంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్ జాతీయ ఉత్తమ గ్రామంగా ఎంపిక కాగా.. చిన్నారుల చదువుతోపాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామ పంచాయతీ చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామంగా జాతీయ స్థాయిలో ఎంపికైంది. మహిళా సంఘాలు తమ ప్రతిభను స్వయంసమృద్ధిని సాధించడంతో మక్తల్ మండలం మంతన్గోడ్ గ్రామం నానాజీ దేశ్ ముఖ్ గౌరవ్ అవార్డుకు ఎంపికైంది. జాతీయ స్థాయిలో మూడు గ్రామాలు గుర్తింపు తెచ్చుకునేందుకు పల్లె ప్రగతి ప్రధాన కారణంగా ఆయా గ్రామాల సర్పంచులు చెబుతున్నారు. గుండ్లపొట్లపల్లిలో బహిరంగ మల విసర్జనను నిషేధించారు. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డితోపాటు ఇంకుడు గుంత కూడా నిర్మించుకున్నారు. రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించేందుకు ట్రాక్టర్, ట్యాంకర్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. నిత్యం చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుల తయారీ, కోతుల కోసం ప్రత్యేకంగా పండ్ల వనాన్ని తీర్చిదిద్దడం ఈ గ్రామం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక చందాపూర్ గ్రామంలో బాల కార్మికులు అనే మాట లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాల్యవివాహాలు జరగకుండా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు చక్కని విద్యతోపాటు ఆటాపాటలకు అవకాశం దక్కేలా చేశారు. చిన్నారులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకున్నారు. బాలికల్లో అక్షరాస్యత పెంపునకు కృషి చేశారు. విద్యతోపాటు వైద్యంపైనా ప్రత్యేక దృష్టి సారించారు. సకల సౌకర్యాలతో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా చందాపూర్ నిలిచింది. మహిళా సంఘాలు స్త్రీనిధి రుణాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించి మక్తల్ మం డలం మంతన్ గోడ్ గ్రామం జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైంది. మహిళా సంఘాలకు చెందిన 15 మంది సభ్యులు హెర్బల్ ఉత్పత్తుల ద్వారా చక్కని గుర్తింపు పొందారు. హెయిల్ ఆయిల్, సర్ఫ్, వ్యాజిలీన్, హెన్నా, ఫినాయిల్తో పాటు తినుబండారాలు సైతం తయారు చేశారు. గ్రామంలో పల్లెప్రగతి ద్వారా చక్కని అభివృద్ధి పనులు సైతం చేపట్టారు. అన్ని రంగాల్లోనూ మెరుగ్గా ఉండటంతో మంతన్గోడ్ దశ తిరిగింది.
మహబూబ్నగర్ జిల్లాలోని 441 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు కొనుగోలు చేశారు. అన్ని గ్రామ పంచాయతీల్లోనూ నర్సరీలు, 665 హ్యాబిటేషన్లలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. 439 గ్రామపంచాయతీలో వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించారు. 500 జనాభాకు ఒక్కరు చొప్పున మల్టీపర్పస్ వర్కర్లను నియమించి క్రమం తప్పకుండా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, డోర్ టు డోర్ కలెక్షన్ చేసి షెడ్లలో కంపోస్ట్ తయారు చేయడం ద్వారా రూ.4,22, 552 గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరింది. పల్లె ప్రగతిలో భాగంగా 1662 శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి తొలగించారు.
వనపర్తి, మే 17 (నమస్తే తెలంగాణ) : పల్లె, ప ట్టణ ప్రగతితో కనీసం సౌకర్యాలు లేని గ్రామాలు.. ప్రస్తుతం సకల సౌకర్యాలతో విరాజిల్లుతున్నాయి. నూతన సొగబులు సంతరించుకున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. హరితహారం లో భాగంగా నాటిన మొక్కలు సంరక్షించేందుకు, నీటి వనరులు అందించేందుకు ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లను ప్రభుత్వం సమకూర్చింది. తాగునీటి వ్యవస్థ మెరుగుపడింది. వైకుంఠధామాలు, విద్యు త్ స్తంభాలు, డ్రైనేజీ సిస్టం, శానిటేషన్, శిథిలావస్థ కు చేరుకున్న భవనాల తొలగింపు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. గతేడాది ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చే యడంతో ఇండ్లు హ రితవనాలుగా మారాయి. అంటువ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. పారిశుధ్య నిర్వహణ కోసం సిబ్బందిని నియమించారు. జిల్లాలో 255 సెగ్రిగేషన్ షెడ్లు, 254 వైకుంఠధామాలు, 319 పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో నూ తనంగా ఐదు పార్కులు నిర్మించారు. అలాగే బృహ త్ ప్రకృతి వనం పేరిట వనపర్తి మండలంలో పదెకరాల్లో మరో పార్కు ఏర్పాటు చేశారు. మండలానికి ఐదు బృహత్ పల్లె ప్రకృతి వనాల చొప్పున జి ల్లాలో 14 మండలాలకుగానూ 70 ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 12 నిర్మించారు. మిగతా 58 వనాలకు సంబంధించిన స్థలా ల్లో ముళ్ల పొదల తొలగింపు, భూమి చదు ను వంటి పనులు చే పడుతున్నారు. 34 వంగిన విద్యుత్ స్తంభాలు, 160 తుప్పు పట్టిన పోల్స్, లూజ్లైన్స్ సరిచేయడం కింద 271 పోల్స్, 191 స్ట్రీట్ లైట్ ఫేస్ స్పాన్స్, ఐదు కొత్త స్ట్రీట్లైట్ మీటర్లు ఏర్పాటు చేశారు. మే 20 నుంచి జూన్ 5 వరకు ఐదో విడుత పల్లె ప్రగతి చేపట్టనున్నారు. వానకాలం నేప థ్యంలో పారిశుధ్యం, ప ర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
గద్వాల, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూ పురేఖలు మారిపోయాయి. గ్రామాలు అభివృద్ధి చెం దితేనే రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతి సత్ఫలితాలిస్తున్నది. జి ల్లాలో ఏ గ్రామంలో చూసినా పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్లతో చెత్త సేకరణ, చివరి మజిలీ ప్రశాంతంగా సాగేలా వైకుంఠధామాల నిర్మాణాలు, రైతులకు సాగుబడి సూచనలిచ్చేందుకు రైతు వేదికలు.. ఇలా అన్ని రకాల వసతులు దర్శనమిస్తున్నాయి. నాలుగు విడుతల్లో పలు రకాల పనులు చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గాం ధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు సర్కార్ అడుగులు వేస్తున్నది. నిత్యం పారిశుధ్య పనులు చేపడుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్, పాతబడిన, విరిగిన విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేపట్టారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా.. 254 గ్రామాల్లో రూ.12 లక్షల చొప్పున రూ.30.48 కోట్లతో వైకుంఠధామాలు ని ర్మించారు. వీటిలో 80 వైకుంఠధామాల్లో బోర్లు వేసి నీటి వసతి కల్పించడంతోపాటు బోర్లు లేని చోట సం పులు ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల మిషన్ భగీరథ ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. రూ.4 ల క్షల చొప్పున 296 పల్లె ప్రకృతి వనాలకు రూ. 11.84 కోట్లు వెచ్చించారు. 255 గ్రామాల్లో రూ. 2.50 లక్షల చొప్పున రూ.6.37 కోట్లతో డంపింగ్ యార్డులు నిర్మించారు. 94 క్లస్టర్లలో రూ.22 లక్షల చొప్పున మొత్తం 20.68 కోట్లతో రైతువేదికలు ని ర్మించారు. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు హరితశోభ సంతరించుకున్నాయి. అంతేకాకుండా గ్రామాలాభివృద్ధి కోసం జిల్లాకు ప్రతి నెలా ప్రభుత్వం రూ.4.68 కోట్లు విడుదల చేస్తున్నది. ఈ నిధులతో స్థానికుల సహకారంతో గ్రామ కార్యదర్శి, సర్పంచులు ప్రణాళిక ప్రకారం పనులు చేపడుతున్నారు. పల్లె ప్రకృతి వనాలతోపాటు బృహ త్ ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం చ ర్యలు తీసుకున్నది. జిల్లాలో 60 బృహత్ ప్రకృతి వనాలకుగానూ ఇప్పటివరకు 19 ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు స్థలాలు చూయించకపోవడంతో మిగతా చోట్ల పను లు ప్రారంభం కాలేదు. పంచాయతీ అధికారు లు స్థలాల కోసం ప్రయత్నిస్తున్నారు.
‘పల్లెప్రగతి’ అద్భుతం..
పల్లె ప్రగతి అద్భుత కార్యక్రమం. దీనిద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడిం ది. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు లు, పల్లె ప్రకృతి వనాలు, డ్రైన్లు, సీసీ రోడ్లను నిర్మిం చాం. పాడుబడిన బావులు పూడ్చడం, ఇండ్ల మధ్య ఉన్న కంపచెట్లు తొలగించ డం తదితర పనులు చేపట్టడంతో పరిశుభ్రంగా మా రాయి. జిల్లాకు ప్రతి నెతి రూ.4.68 కోట్లు ప్రభు త్వం విడుదల చేస్తున్నది.
– శ్యాంసుందర్, డీపీవో, జోగుళాంబ గద్వాల
నారాయణపేట, మే 17 : గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పచ్చదనం-పరిశుభ్రత వంటి కార్యక్రమాలతో ఆదర్శవంతమైన గ్రామాలు, పట్టణాలుగా మారాయి. ప్రతి గ్రామానికి, పట్టణానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. గ్రామాల్లో చేపట్టిన పనులను ఆకస్మికంగా పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయిలో ఐఏఎస్ అధికారులను ఫ్లయింగ్ స్కాడ్లుగా ఏర్పాటు చేశారు. ఫలితంగా పల్లె, పట్టణ ప్రగతి సత్ఫలితాలిస్తున్నాయి. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను, పిచ్చి మొక్కలను తొలగించడం, మరుగుదొడ్లు, రోడ్లను శుభ్రపరిచారు. ప్రతి ఇంటికీ ఐదు మొక్కలు పంపిణీ చేశారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో గ్రామాలు, వార్డులు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. దాదాపు 95 శాతం మేరకు విద్యుత్ సమస్యలు పరిష్కరించారు. 24 వార్డులు ఉన్న పేట మున్సిపాలిటీకి ప్రతి నెలా రూ.39 లక్షలు, 16 వార్డులు ఉన్న కోస్గి మున్సిపాలిటీకి ప్రతినెలా రూ.8 లక్షలు, 16 వార్డులు ఉన్న మక్తల్ మున్సిపాలిటీకి ప్రతి నెలా రూ.16 లక్షలు ప్రభుత్వం విడుదల చేస్తున్నది. పట్టణ ప్రగతి ప్రారంభించిన నాటి నుంచి మక్తల్ మున్సిపాలిటీకి రూ.5.35 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో కూరగాయల మార్కెట్, మియావాకీ ఫారెస్ట్, పల్లె, బృహత్ ప్రకృతివనాలు వంటి పనులు చేపట్టారు. కోస్గి మున్సిపాలిటీలో ఇప్పటివరకు రూ.6.19 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నిధులతో ఓపెన్ జిమ్, పార్క్, కమ్యూనిటీ టాయ్లెట్ వంటి పనులు చేపట్టడంతోపాటు ట్రాక్టర్లు, ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. పేట మున్సిపాలిటీకి వచ్చిన రూ.8 కోట్లతో ఓపెన్ జిమ్, పార్కులు, రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు వంటి పనులు చేపట్టారు. జిల్లాలోని 280 గ్రామ పంచాయతీల్లో రూ.8కోట్లతో 336 పల్లె ప్రకృతి వనాలు నిర్మించారు. 55 బృహత్ ప్రకృతి వనాలకుగానూ 30 చోట్ల పూర్తయ్యాయి. ఈ ఏడాది హరితహారంలో భాగంగా జిల్లాలో 30 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
నాగర్కర్నూల్, మే 17 (నమస్తే తెలంగా ణ) : గ్రామాలాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాలుగు విడుతల్లో ప నులు చేపట్టారు. పారిశుధ్యం, పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామా ల్లో వీధులు, మురుగు కాల్వలు శుభ్రం చేశారు. ముళ్ల చెట్లు, చెత్తను తొలగించా రు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో పరిసరాలను, నీళ్ల ట్యాంకుల ను శుభ్రం చేశారు. ఇక గ్రామాల్లో, రో డ్ల వెంట మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచారు. మొక్కలకు నీళ్లు పోసేందు కు, చెత్త సేకరించేందుకు ట్రాక్టర్లను స మకూర్చుకున్నారు. హరితహారం కోసం గ్రీన్ బడ్జెట్ పేరిట ప్రజలు, విద్యార్థుల నుంచి నిధులు సేకరిస్తున్నది. గ్రామాల్లో మలేరియా, డెంగీ, బో ధకాలు, అతిసార వంటి కేసులు సింగల్ డిజిట్కే ప రిమితమయ్యాయి. గ్రామ పంచాయతీకి నిధుల సమస్య తీరిపోయింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి నెలా పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా నిధు లు జమ అవుతున్నాయి. అభివృద్ధికి ఆకర్షితులవుతున్న ప్రజలు ఆస్తి పన్ను వసూళ్లకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రతి పంచాయతీలో దాదాపుగా వంద శాతం పన్నులు చెల్లిస్తుండడం విశేషం. జిల్లాలో 461 పంచాయతీలకుగానూ 2020-21 లో 15వ ఫైనాన్స్, స్టేట్ ఫైనాన్స్ నిధుల కింద జనాభాను బట్టి రూ.119 కోట్లు విడుదలయ్యాయి. గతేడాది రూ.97 కోట్లు విడుదలయ్యాయి. ఈ క్రమం లో ప్రజలు ప్రస్తుత సంవత్సరం 91 శాతం మేర ఆ స్తి పన్ను చెల్లించారు. జిల్లాలో రూ.7.44 కోట్లకుగా నూ రూ.6.83 కోట్లు వసూలు చేయడం గమనా ర్హం. కోడేరు, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో వందశాతం ఆస్తి పన్ను చెల్లించారు. అన్ని గ్రామాల్లో శ్మశాన వాటిక సమస్య తీరింది. 461 వైకుంఠధా మాల్లో 96 చోట్ల తాగునీటి సరఫరా, 149 చోట్ల క రెంట్ సరఫరా లేదు. ఈ ఏడాది పనులు చేపట్టేం దుకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 662 పల్లె ప్రకృతి వనాలు ఏ ర్పాటు చేశారు. 100 బృహత్ వనాలకుగానూ 23 వనాలను పూర్తి చేశారు. ఈ ఏడాది ప్రతి గ్రామంలో అర ఎకరం లేదా ఎకరా స్థలంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నారు. భూ సేకరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తమ్మీద గ్రామాల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతున్నది.
ఎటు చూసినా అభివృద్ధే..
పల్లె ప్రగతితో గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నది. ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నది. గ్రామాల్లో చేపడుతున్న పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. అభివృద్ధి చేస్తే ప్రజలు సహకరిస్తారనేదానికి పల్లెప్రగతి ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తున్నది. ఈనెల 20 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఐదో విడుత పల్లె ప్రగతి చేపడుతున్నాం.
– కృష్ణ, డీపీవో, నాగర్కర్నూల్